కూలిన ఎయిరిండియా విమానం.. ఏకంగా 242 మంది..!
ABN, Publish Date - Jun 12 , 2025 | 04:01 PM
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. మేఘానిలో టేకాఫ్ అయిన ఫ్లైట్ వెంటనే కుప్పకూలింది. అలర్ట్ అయిన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

లండన్కు బయల్దేరిన ఎయిరిండియా ఏఐ-171 ఫ్లైట్ టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కుప్పకూలింది.

కుప్పకూలిన ఎయిరిండియా విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో ఫ్లైట్లో 230 మంది ప్యాసింజర్లతో పాటు 12 మంది స్టాఫ్ ఉన్నారు.

హాస్పిటల్ హాస్టల్ బిల్డింగ్ మీద ఈ విమానం కూలింది.

విమానం కూలడంతో రెండు భారీ భవనాల్లోనూ మంటలు చెలరేగాయి.

20 మందికి పైగా డాక్టర్లు చనిపోయారని సమాచారం.
Updated at - Jun 12 , 2025 | 04:03 PM