ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం..
ABN, Publish Date - Apr 12 , 2025 | 07:02 AM
కడప: ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం శుక్రవారం రాత్రి పండువెన్నెల్లో చంద్రుడు తిలకిస్తుండగా.. అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణ భారత దేశం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

ఒంటిమిట్ట సీతారాముల కల్యాణం కనుల విందుగా జరిగింది.

విద్యుత్ కాంతులతో విరాజిల్లుతున్న ఒంటిమిట్ల కోదండరామాలయం..

ఒంటిమిట్ట కోదండరామునికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు తీసుకువస్తున్న సీఎం చంద్రబాబు దంపతులు..

సీఎం చంద్రబాబు దంపతులు సీతారాములకు నైవేద్యం సమర్పిస్తున్న దృశ్యం..

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణంలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు..

చంద్రబాబు దంపతులకు సీతారాముల మెమెంటోను బహుకరిస్తున్న అధికారులు..

కోదండరాముని కళ్యాణం అనంతరం అర్చకుడు ఇస్తున్న హారతి తీసుకుంటున్న చంద్రబాబు దంపతులు

ఒంటిమిట్ట కోదండరాముని కళ్యాణం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
Updated at - Apr 12 , 2025 | 07:02 AM