Bonalu Festival 2025: ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ దంపతులు
ABN, Publish Date - Jul 11 , 2025 | 01:12 PM
Bonalu Festival 2025: బోనాల ఉత్సవాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారికి గవర్నర్ సతీమణి బోనం సమర్పించారు. ఆపై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారి పటాన్ని బహూకరించారు.

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు

అమ్మవారికి బోనం సమర్పించిన గవర్నర్ సతీమణి

గవర్నర్ దంపతులకు అమ్మవారి పటాన్ని అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్

సికింద్రాబాద్ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాల సందడి

భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు

అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరిన భక్తులు

మహంకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల కోలాహలం

ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పోతరాజుల విన్యాసాలు
Updated at - Jul 11 , 2025 | 01:13 PM