ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సాక్షి మీడియాపై వెలువెత్తిన నిరసన
ABN, Publish Date - Jun 10 , 2025 | 09:15 PM
సాక్షి ఛానల్ డిబేట్లో అమరావతి మహిళలను ఉద్దేశించి జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలు పై రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు.

సాక్షి మీడియాను తక్షణమే రద్దు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళలు నిరసన వ్యక్తం చేసారు

రాజధాని అమరావతి, మహిళలపై జర్నలిస్ట్లు కొమ్మినేని శ్రీనివాసరావు, కృష్ణంరాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తెలుగు మహిళలు ఖండించారు

రాష్ట్ర మహిళలందరికీ తక్షణమే సాక్షి మీడియా యాజమాన్యం క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు ప్లకార్డులు ప్రదర్శించారు

పలు చోట్ల సాక్షి దినపత్రికను తగలబెట్టి చెప్పులతో కొట్టి నిరసన తెలియజేశారు

రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తెలుగు మహిళలు ర్యాలీలు చేశారు

జగన్, భారతి రెడ్డిలు మహిళలకు క్షమాపణ చెప్పాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు

తిరుపతి జీవకోనలో స్వచ్ఛందంగా నిరసన తెలిపిన తెలుగు మహిళలు

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి చెప్పుతో కొట్టిన మహిళలు

చిత్తూరులో సాక్షి పేపర్ మూసేయాలని, భారతి రెడ్డిని అరెస్ట్ చేయాలని నిరసన ర్యాలీ చేపట్టి సాక్షి పేపర్ను దహనం చేసిన మహిళలు

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం దేవీచౌక్లో ర్యాలీ నిర్వహించి సాక్షి పత్రికలను తగలబెడుతున్న కూటమి మహిళా నాయకులు
Updated at - Jun 10 , 2025 | 09:15 PM