ఘనంగా మసూలా బీచ్ ఫెస్టివల్..
ABN, Publish Date - Jun 07 , 2025 | 09:08 PM
మసూలా బీచ్ ఫెస్టివల్లో భాగంగా మూడో జాతీయ స్థాయి సీ కయాకింగ్ పోటీలను ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 17 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు. ఏపీలో తొలిసారిగా సీ కయాకింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు

మసూలా బీచ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది

మూడు రోజులపాటు పోటీలు జరగనున్నాయి. ప్రతి రోజూ సాయంత్రం 5 గంటల నుంచి స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభం కానున్నాయి

సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో స్టేజ్ ఈవెంట్స్ ప్రారంభిస్తారు

బీచ్ ఫెస్టివల్లో బీచ్ కబడ్డీ, బీచ్ వాలీబాల్, కయాకింగ్ వంటి పోటీలు నిర్వహిస్తున్నారు

బీచ్ ఫెస్టివల్ సందర్భంగా 80 అడుగుల అమరావతి ముఖద్వారం ఏర్పాటు చేశారు

టూరిస్టులను ఆకర్షిస్తూ పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు

బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లను ఆసక్తిగా మచిలీపట్నం వాసులు, పర్యాటకులు తిలకిస్తున్నారు

ప్రత్యేక ఆకర్షణగా హెలిరైడ్, పారాగ్లేడింగ్, స్పీడ్ బోటింగ్ ఏర్పాటు చేశారు.

22 రాష్ట్రాల నుంచి 4000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటున్నారు
Updated at - Jun 07 , 2025 | 09:08 PM