Share News

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..

ABN , Publish Date - May 03 , 2025 | 02:38 PM

Maharashtra News: లోపల భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..
Maharashtra News

థానే : మహారాష్ట్రలోని థానేలో దారుణం చోటుచేసుకుంది. ఒకే ఇంటికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. భర్త ఇంటికి తిరిగి వచ్చే సరికి భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని థానే.. భివాండికి చెందిన ఓ వ్యక్తి తన భార్య, ముగ్గురు పిల్లలతో అక్కడి ఓ ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఆ భర్త నైట్ షిఫ్ట్ చేస్తూ ఉన్నాడు. రోజూ లాగే శుక్రవారం రాత్రి కూడా నైట్ షిఫ్ట్‌కు వెళ్లాడు.


శనివారం ఉదయం ఇంటికి తిరిగి వచ్చాడు. తలుపు లోపలినుంచి లాక్ చేసి ఉండటంతో.. భార్యను పిలిచాడు. స్పందన రాలేదు. తలుపు దగ్గర చప్పుడు చేశాడు. అయినా స్పందన రాలేదు. కిటికీ దగ్గరకు వెళ్లి లోపలికి చూశాడు. అక్కడి దృశ్యం చూసి షాక్ అయ్యాడు. అతడి గుండె పగిలినంత పనైంది. లోపల భార్యతో పాటు ముగ్గురు పిల్లలు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. అతడు వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు.


తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. శవాలను కిందకు దించి పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సంఘటనా స్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది. దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే, వారు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే దానిపై స్పష్టత రాలేదు. ఇక, ఈ సంఘటనపై సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృష్ణారావు ఖరాడే స్పందిస్తూ.. ‘ ఓ తల్లి ఆమె ముగ్గురు పిల్లలు ఇంట్లో ఉరి తాడుకు వేలాడుతూ కనిపించారు. అక్కడ ఓ సూసైడ్ నోట్ దొరికింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాము’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

Jio Offer: రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాలింగ్

Summer Vacation Tips: సమ్మర్ వెకేషన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పక పాటించండి..

Updated Date - May 03 , 2025 | 02:49 PM