Shashi Tharoor: విక్రమ్ మిస్రీ సేవలు ప్రశంసనీయం: శశిథరూర్
ABN , Publish Date - May 19 , 2025 | 09:57 PM
విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు శశిథరూర్ చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు.

న్యూఢిల్లీ: భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన అనంతరం భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram Misri), ఆయన కుటుంబ సభ్యులు లక్ష్యంగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్స్ను పార్లమెంటరీ ప్యానల్ ఏకగ్రీవంగా ఖండించింది. విక్రమ్ మిస్రీకి ఉన్న వృత్తిపరమైన నిబద్ధతను ప్రశంసించింది. ఆపరేషన్ సింధూర్, అనంతర పరిణమాలను పార్లమెంటరీ కమిటీకి విక్రమ్ మిస్రీ సోమవారంనాడు వివరించారు.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై పార్లమెంటరీ ప్యానల్కు విక్రమ్ మిస్రీ వివరణ
అనంతరం మీడియాతో పార్లమెంటరీ కమిటీ చైర్మన్ శశిథరూర్ మాట్లాడుతూ, విక్రమ్ మిస్రీపై సోషల్ మీడియా దాడులను ఖండిస్తూ సమావేశంలో ఒక తీర్మానం చేయాలని అంతా భావించినట్టు చెప్పారు. అయితే మిస్రీ అందుకు నిరాకరించారని తెలిపారు. ''దేశానికి విక్రమ్ మిస్రీ చక్కటి సేవలు అందిస్తున్నారు. ఆయనకు అంతా బాసటగా ఉండాలని కమిటీ ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. ఇది లాంఛనమైన పూర్వకమైన తీర్మానం కానప్పటికీ దేశ ప్రజలందరి అభిప్రాయం కూడా ఇదే" అని శశిథరూర్ చెప్పారు.
పార్లమెంటరీ ప్యానల్ సమగ్రమైన, విలువైన సమావేశం జరిపినట్టు ఆయన చెప్పారు. సభ్యులు కూడా ఆలోచింపజేసే ప్రశ్నలను విదేశాంగ కార్యదర్శని అడిగారని, సంతృప్తికరమైన సమాధానాలు వచ్చాయని శశిథరూర్ తెలిపారు. ఎంతో స్ఫూర్తిదాయకంగా ఈ సమావేశం జరిగినట్టు వివరించారు.
ఇవీ చదవండి:
Operation Sindoor: మౌనం విపత్కరం.. జైశంకర్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు, బీజేపీ కౌంటర్
భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..
ఇద్దరు ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్టు చేసిన ఎన్ఐఏ
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి