Udyog Bhawan Bomb Threat: ఢిల్లీ ఉద్యోగ్ భవన్కు బాంబు బెదిరింపు
ABN , Publish Date - May 30 , 2025 | 06:10 PM
పార్లమెంటుకు సమీపంలోని హై-సెక్యూరీటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ (Udhyog Bhawan)కు శుక్రవారం బాంబు బెదిరింపు వచ్చింది. శక్తివంతమైన పేలుడు పదార్ధాలతో (IEDs) దాడి జరగనుందంటూ భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శికి అడ్రెస్ చేస్తూ ఈ-మెయిల్ బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సీఐఎస్ఎస్ బలాగాలు వెంటనే రంగంలోకి దిగాయి. ఆయా కార్యలాయాల్లోని సిబ్బందిని బయటకు పంపించి, క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాయి. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు.
పార్లమెంటుకు సమీపంలోని హై-సెక్యూరీటీ ప్రాంతంలో ఉద్యోగ్ భవన్ ఉంది. ఇందులో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, మంత్రిత్వ శాఖ కార్యాలయాలు ఉన్నాయి. భారీ పరిశ్రమల శాఖకు సంబంధించిన నివాసాలు ఉన్నాయి. తాజాగా ఉద్యోగ్ భవన్కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
సీఎం కార్యాలయం పేల్చేస్తామని బెదిరింపులు
కాగా, హర్యానా మఖ్యమంత్రి కార్యాలయం పేల్చేస్తామంటూ చండీగఢ్ పోలీస్ స్టేషన్కు శుక్రవారం ఉదయం బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో సీఎం కార్యాలయం, ఇతర ప్రభుత్వ కార్యాలయాల వద్ద హైఅలర్ట్ ప్రకటించారు. హర్యానా సెక్రటేరియట్, సీఎం రెసిడెన్స్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తోంది. భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. బెదిరింపు కాల్స్ ఎక్కడ నుంచి వచ్చాయో తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
కమల్ థగ్ లైఫ్ సినిమాపై నిషేధం.. కేఎఫ్సీసీ సంచలన నిర్ణయం
పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అండగా నిలుస్తాం
For National News And Telugu News