Share News

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

ABN , Publish Date - May 14 , 2025 | 02:30 PM

రాష్ట్రపతి భవన్‌లో ఆర్మీ ఉన్నతాధికారులను తనను కలిసిన ఫోటోను రాష్ట్రపతి షేర్ చేశారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తనను కలుసుకున్నారని ఈ పోస్ట్‌లో రాష్ట్రపతి తెలిపారు.

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు బుధవారం నాడు భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు సంబంధించిన వివరాలను రాష్ట్రపతికి వీరు వివరించారు.

Operation Sindoor: చైనాకు భారత్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు


రాష్ట్రపతి భవన్‌లో ఆర్మీ ఉన్నతాధికారులు తనను కలిసిన ఫోటోను రాష్ట్రపతి ముర్ము షేర్ చేశారు. సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, నావల్ స్టాఫ్ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె.త్రిపాఠి తనను కలుసుకున్నారని ఈ పోస్ట్‌లో రాష్ట్రపతి తెలిపారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను తెలియజేశారని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా త్రివిధ దళాలు పోరాడిన తీరును రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్థాన్, పీఓకేలోని తొమ్మిది చోట్ల ఉగ్రశిబిరాలపై భారత త్రివిధ దళాల బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో ఉగ్రశిబిరాలు నేలమట్టం కావడంతోపాటు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. ఇందుకు బదులుగా భారత మిలటరీ, సివిలియన్ ఏరియాల్లో పాక్ దాడులకు దిగడంతో భారత్ సమర్ధవంతంగా వాటిని తిప్పికొట్టింది. 11 పాకిస్థాన్ ఎయిర్‌బేస్‌లపై కీలక దాడులు జరిపింది. దీంతో కాళ్లబేరానికొచ్చిన పాక్ కాల్పుల విరమణ ప్రతిపాదన చేయడంతో అందుకు భారత్ అంగీకరించింది.


ఉగ్రవాదంపై ఆపరేషన్ సిందూర్ కొత్త నిర్వచనం ఇచ్చిందని, టెర్రరిజం మూలాలు ఎక్కడున్నా భీకరంగా దాడులు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. పాక్ న్యూక్లియర్ బ్లాక్‌మెయిల్‌కు లొంగే ప్రసక్తే లేదని, ఉగ్రశిబిరాలను సమూలంగా నాశనం చేస్తామన్నారు. టెర్రరిజం, టెర్రరిజం వెనక ఉన్న ప్రధాన సూత్రధారులను వేర్వేరుగా చూడమన్నారు. భారత్‌ను, దేశ ప్రజలను పరిరక్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటామని ప్రధాని స్పష్టం చేశారు.


ఇవి కూాడా చదవండి..

BSF Jawan: బీఎస్ఎఫ్ జవాన్ విడుదల.. అటారీ వద్ద భారత్‌కు అప్పగించిన పాకిస్తాన్..

India VS Pakistan: భారత్-పాక్ కాల్పుల విరమణ.. పాకిస్తాన్‌పై చైనా గుర్రు.. కారణమిదే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 14 , 2025 | 03:24 PM