Share News

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత..

ABN , Publish Date - Jun 07 , 2025 | 06:53 PM

సోనియాగాంధీ ఆసుపత్రిలో చేరిన విషయాన్ని హిమాచల్ ప్రదేస్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ అడ్వైజర్ (మీడియా) నరేష్ చౌహాన్ ధ్రువీకరించారు. స్వల్ప ఆరోగ్య సమస్యలతో రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు.

Sonia Gandhi: సోనియాగాంధీకి అస్వస్థత..

సిమ్లా: కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో శనివారం నాడు చేర్చారు. ప్రస్తుతం ఆమెకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.


ఆసుపత్రిలో సోనియాగాంధీ చేరిన విషయాన్ని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రిన్సిపల్ అడ్వైజర్ (మీడియా) నరేష్ చౌహాన్ ధ్రువీకరించారు. స్వల్ప ఆరోగ్య సమస్యలతో రొటీన్ హెల్త్ చెకప్ కోసం ఆమె ఆసుపత్రిలో చేరినట్టు చెప్పారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. సోనియాగాంధీకి ఎంఆర్ఐ పరీక్షలు జరిపినట్టు తెలుస్తోంది. 78 ఏళ్ల సోనియాగాంధీ చివరిసారిగా మే 27న దివంగత ప్రధాని జవహర్‌లా నెహ్రూ 61వ వర్దంతి సందర్భంగా కనిపించారు.


ఇవి కూడా చదవండి..

పాక్‌తో గూఢచర్యం కేసులో కీలక మలుపు..

కాళ్లబేరానికి పాకిస్థాన్..

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 07:55 PM