Share News

India Pakistan Ceasefire: 1971 పరిస్థితికి 2025కూ తేడా ఉంది: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - May 11 , 2025 | 05:28 PM

1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని శశిథరూర్ అన్నారు. పాక్‌తో యుద్ధాన్ని పొడిగించడం భారత్‌ టాప్ ప్రియారిటీగా లేదన్నారు

India Pakistan Ceasefire: 1971 పరిస్థితికి 2025కూ తేడా ఉంది: శశిథరూర్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించినట్టు కేంద్రం ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రచారానికి దిగింది. 1971లో ఇందిరాగాంధీ పాక్‌పై తీసుకున్న చర్యను ప్రస్తావిస్తూ ఈ పోస్టులు కనిపిస్తున్నాయి. మొత్తం వ్యవహారంపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రధాని మోదీకి లేఖాస్త్రం కూడా సంధించింది. కాగా, కాంగ్రెస్ విమర్శలపై ఆ పార్టీ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ ఒకింత భిన్నంగా స్పందించారు. 1971 యుద్ధంలో ఇందిరాగాంధీ తీసుకున్న చర్యలతో 2025 నాటి పరిస్థితిని పోల్చలేమని అన్నారు. పాక్‌తో యుద్ధాన్ని పొడిగించడం భారత్‌ టాప్ ప్రియారిటీగా లేదన్నారు.

Operation Sindoor: బ్రహ్మోస్ సత్తా ఏమిటో పాక్‌ను అడగండి: యోగి


''1971 కచ్చితంగా గొప్ప విజయం. ఉపఖండం స్వరూపాన్నే ఇందిరాగాంధీ మార్చేశారు. అయితే అప్పటి పరిస్థితులు వేరు. ఒక నైతిక కారణంతో బంగ్లాదేశ్ పోరాటం చేసింది. బంగ్లాదేశ్ విముక్తి అనేది ఆ ముఖ్య ఉద్దేశం. పాకిస్థాన్‌పై గుళ్ల వర్షం కురిపించడం ఎంతమాత్రం లక్ష్యం కాదు. ఇప్పటి పరిస్థితులు వేరు. ఇప్పటి పాకిస్థాన్ వేరు. వారి సామర్థ్యం, ఆయుధాలు అన్నీ భిన్నంగా ఉన్నాయి'' అని థరూర్ అన్నారు.


ఇండియా-భారత్ మధ్య కాల్పుల విరమణ అవగాహనపై శశిథరూర్ మాట్లాడుతూ.. ''ఉద్రికతలు అదుపు తప్పే స్థాయికి వెళ్లాం. శాంతి అనేది మనకు చాలా ముఖ్యం. నిజం ఏమిటంటే 1971 నాటి పరిస్థితి, 2025 నాటి పరిస్థితి వేర్వేరు. యుద్ధం కొనసాగించాలనే ఉద్దేశంతో చేపట్టిన యుద్ధం కాదిది. టెర్రరిస్టులకు ఒక గుణపాఠం చెప్పాలని మనం అనుకున్నాం. బదులు చెప్పాం. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులను ప్రభుత్వం గుర్తించి, ట్రాక్ చేస్తుందని నేను భావిస్తున్నాను. యుద్ధం సుదీర్ఘకాలం జరిగితే ఇరువైపులా ప్రాణనష్టం ఉంటుంది'' అని అన్నారు.


ఇందిరను గుర్తుచేసిన కాంగ్రెస్

దీనికి ముందు, ఇంధిరాగాంధీని గుర్తు చేస్తూ కాంగ్రెస్ నేత పవన్ ఖేర సామాజిక మాధ్యమంలో మాజీ ప్రధాని ఇమేజ్‌లను పోస్ట్ చేశారు. న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య జరిగిన 1971 యుద్ధాన్ని ప్రస్తుతిస్తూ ''India misses Indira'' అంటూ పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సైతం ఇందిరాగాంధీ పాత ఫోటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ''ఇందిరాజీ.. ఇవాళ యావద్దేశం మిమ్మల్ని గుర్తు చేసుకుంటోంది'' అని ఆ పోస్ట్‌కు కాప్షన్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి:

బయటపడిన పాక్ పాపాలు

కశ్మీర్ సమస్యపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 11 , 2025 | 05:28 PM