ముసుగు వేసేద్దాం.!
ABN , Publish Date - Jun 12 , 2025 | 05:33 AM
అబ్బెబ్బే.. ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మాకేం నష్టంలేదు అని పాకిస్థాన్ చెప్పడం ఉత్తి బుకాయింపే అని శాటిలైట్ చిత్రాల్లో బయటపడింది. సిందూర్ దాడుల్లో దెబ్బతిన్న మూడు మిలిటరీ సైట్లలో రూఫ్టా్పకు టార్పాలిన్లు కప్పి రిపేర్లు చేస్తోంది.

సిందూర్ దెబ్బతో మూడు మిలిటరీ సైట్లపై టార్పాలిన్లు
న్యూఢిల్లీ, జూన్ 11: అబ్బెబ్బే.. ఆపరేషన్ సిందూర్ దాడుల్లో మాకేం నష్టంలేదు అని పాకిస్థాన్ చెప్పడం ఉత్తి బుకాయింపే అని శాటిలైట్ చిత్రాల్లో బయటపడింది. సిందూర్ దాడుల్లో దెబ్బతిన్న మూడు మిలిటరీ సైట్లలో రూఫ్టా్పకు టార్పాలిన్లు కప్పి రిపేర్లు చేస్తోంది. దానిని హైరిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు పసిగట్టాయి. పాక్ కవరింగ్ను ఆ ఫొటోలు బహిర్గతం చేశాయి. ఆ వివరాలను ఇండియా టుడే తన కథనంలో వివరించింది. పాక్లోని మురిద్, జకోబాబాద్, భోలారీల్లోని బేస్లు భారత్ దాడుల్లో తీవ్రంగా దెబ్బతిన్నాయి. సింధ్లోని భోలారీ ఎయిర్ బేస్ భారత్ దాడుల్లో బాగా దెబ్బతిన్నట్లు గతంలోనే బయటపడింది.
అయితే దెబ్బతిన్నట్లు కనబడకుండా ఉండేందుకు దాని పైకప్పునకు నీట్గా ఓ కవర్ కప్పేసింది. అయితే ఈనెల 4న తీసిన శాటిలైట్ ఫొటోల్లో అది కవరింగే అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక పంజాబ్లోని మురిద్ బేస్ది కూడా ఇదే కథ. ఇక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్పై టార్పాలిన్ కప్పి కింద రిపేర్లు చేస్తునట్లు స్పష్టంగా కనిపిస్తోంది.. ఇక ఎఫ్-16కు స్థావరమైన జకోబాబాద్ ఎయిర్ఫోర్స్ బేస్లో కూడా ఇలాంటి పనులే కనిపిస్తున్నాయి.