Railway station: జాగ్రత్త.. రైల్వే స్టేషన్లలో రీల్స్, వీడియోలు తీయడం నిషేధం..
ABN , Publish Date - May 28 , 2025 | 10:00 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీలైన ప్రతి చోటా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. కొందరు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వీలైన ప్రతి చోటా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసేస్తున్నారు. కొందరు రీల్స్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఆయా వీడియోల వల్ల భద్రతా పరమైన సమస్యలు కూడా వచ్చే ప్రమాదాలున్నాయి. దీంతో తూర్పు రైల్వే ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
రైల్వే స్టేషన్లలో రీల్స్, ఫొటోలు, వీడియోలు తీసుకోవడాన్ని నిషేధించినట్టు కోల్కతాలో ఉన్న తూర్పు రైల్వే శాఖ ప్రకటించింది. ఈస్ట్రన్ రైల్వే ఛీప్ పబ్లిక్ ఆఫీసర్ దిప్తమే దత్తా ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. రైల్వే స్టేషన్ పరిసరాల్లోనూ, ప్లాట్ఫామ్ల మీద వీడియోలు, ఫొటోలు తీయడాన్ని నిషేధించారు. తూర్పు రైల్వే పరిధిలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని, యూట్యూబర్లు, వ్లాగ్లు చేసే వారు ఈ నిబంధనలను పాటించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
సూర్యాపేటలో శిశు విక్రయాల ముఠా.. నిందితుల్లో నర్సులు, వ్యాపారులు..
భర్త సర్ప్రైజ్.. భార్య ఎమోషనల్
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..