Ramdas: నాటకమాడింది చాలు... నీట్ రద్దు చేయించండి
ABN , Publish Date - May 21 , 2025 | 12:44 PM
నాటకమాడింది చాలు... ఇక నీట్ రద్దు చేయించండి.. అని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీట్కు హాజరైన విద్యార్థుల్లో పలువురు ఉత్తీర్ణులు కాలేమన్న భయంతో మనశ్శాంతి కోల్పోయి, మానసికంగా బాధపడుతున్నారని, ఇలాంటి మరణాలకు డీఎంకే ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు.

- ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాందాస్
చెన్నై: నాటకాలు ప్రదర్శించకుండా ఇప్పటికైనా నీట్ను రద్దు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం చర్యలు చేపట్టాలని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr Ramdas) డిమాండ్ చేశారు. ఇటీవల నీట్కు హాజరైన సేలం విద్యార్థి గౌతమ్ ఆ పరీక్షలో ఫెయిల్ అవుతాననే అనుమానంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఏడాది నీట్ భయంతో ఆరుగురు ఆత్మహత్య చేసుకోవడంపై రాందాస్ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. నీట్కు హాజరైన విద్యార్థుల్లో పలువురు ఉత్తీర్ణులు కాలేమన్న భయంతో మనశ్శాంతి కోల్పోయి,
ఈ వార్తను కూడా చదవండి: Vandebharath Express: కాట్పాడి మీదుగా విజయవాడకు వందేభారత్ ఎక్స్ప్రెస్
మానసికంగా బాధపడుతున్నారని, ఇలాంటి మరణాలకు డీఎంకే(DMK) ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. 2021 ఎన్నికల డీఎంకే మేనిఫెస్టోలోని 500కు పైగా హామీల్లో నీట్ రద్దు ఒకటని, అయితే అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్ళు పూర్తవుతున్నా హామీని నెరవేర్చకుండా విద్యార్థులను మభ్యపెట్టేలా నాటకాలు ఆడుతోందని విమర్శించారు. సీఎం ఇప్పటికైనా నీట్ రద్దు చేసేలా చర్యల తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: పెరిగిన ధరలకు బ్రేక్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
నల్లమల సంపదపై రేవంత్ కన్ను: బీఆర్ఎస్
BSF Jawan: దేశసేవకు వెళ్లి.. విగతజీవిగా ఇంటికి..
Adilabad MP Nagesh: పటాన్చెరు- ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మాణ పనులు చేపట్టాలి
Read Latest Telangana News and National News