Chennai: ఊపిరి ఉన్నంతవరకూ పార్టీ అధ్యక్షుడు నేనే..
ABN , Publish Date - Jun 14 , 2025 | 12:35 PM
వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయించానని, అయితే పార్టీలో 99 శాతం మంది దానిని వ్యతిరేకిస్తుండటంతో ఊపిరున్నంతవరకూ తానే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్ ప్రకటించారు.

- పీఎంకే నేత రాందాస్
చెన్నై: వచ్చే యేడాది శాసనసభ ఎన్నికల తర్వాత అన్బుమణిని పార్టీ అధ్యక్షుడిగా చేద్దామని నిర్ణయించానని, అయితే పార్టీలో 99 శాతం మంది దానిని వ్యతిరేకిస్తుండటంతో ఊపిరున్నంతవరకూ తానే పార్టీ అధ్యక్షుడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నానని పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ రాందాస్(Dr Ramdas) ప్రకటించారు. దిండివనం తైలాపురం గార్డెన్ నివాసంలో ఆయన మాట్లాడుతూ పార్టీ మహానాడు తర్వాత అన్బుమణి ప్రవర్తనలో ఊహించని మార్పులు జరిగాయని, తనను వెన్నుపోటు పొడిచాడని, పార్టీపై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
జూలై 25నుంచి అన్బుమణి పాదయాత్ర..
ఇదిలా ఉండగా.. శుక్రవారం ఉదయం పీఎంకే జిల్లా కార్యదర్శులతో సమావేశమైన అన్బుమణి.. డీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీని అభివృద్ధి పరిచే దిశగా జూలై 25 నుండి వంద రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర జరపాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో జిల్లా కార్యదర్శులే కాకుండా సాధారణ కార్యకర్తలు కూడా తనవైపే ఉన్నారని పార్టీ వ్యవస్థాపకుడు రాందాస్కు పరోక్షంగా తెలియజేసేందుకే అన్బుమణి ఈ పాదయాత్ర చేపడుతున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
తెలంగాణ గవర్నర్ను కలిసిన బాలకృష్ణ
Read Latest Telangana News and National News