Share News

Jagdeep Dhankar: న్యాయవ్యవస్థపై దన్‌ఖడ్ వ్యాఖ్యల దుమారం.. విపక్షాలు ఆక్షేపణ, తిప్పికొట్టిన బీజేపీ

ABN , Publish Date - Apr 18 , 2025 | 07:51 PM

ప్రజాస్వామ్యంలో భారత రాజ్యంగం సుప్రీం అని, రాష్ట్రపతి అయినా ప్రధాని, గవర్నర్లు అయినా దానికి అతీతులు కారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. పెండింగ్ బిల్లులపై గడువులోగా రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సరైన సమయంలో సాహసోపేతమైన తీర్పు ఇచ్చిందని అన్నారు.

Jagdeep Dhankar: న్యాయవ్యవస్థపై దన్‌ఖడ్ వ్యాఖ్యల దుమారం.. విపక్షాలు ఆక్షేపణ, తిప్పికొట్టిన బీజేపీ

న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ, దాని ప్రొసీడింగ్స్‌పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar) చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. రాష్ట్రపతిని ఆదేశించే విధంగా న్యాయవ్యవస్థ వ్యవహరించడాన్ని థన్‌ఖడ్ తప్పుపట్టారు. జడ్జీలే సూపర్ పార్లమెంటును నడిపిస్తున్నట్టుందని వ్యాఖ్యానించారు. దీనిపై ప్రధాన విపక్ష పార్టీలు మండిపడగా, ఉపరాష్ట్రపతికి సమర్ధనగా బీజేపీ స్పందించింది.

Kapil Sibal: ఇందిరాగాంధీ ఉదంతం గుర్తులేదా? జగదీప్ ధన్‌ఖడ్‌కు సిబల్ కౌంటర్


న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలను కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే తదితప పార్టీలు తప్పుపట్టాయి. న్యాయవ్యవస్థను బలహీనపరిచేలా ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించడం ఆయన ధిక్కార వైఖరిని చాటుతోందని విపక్ష పార్టీలు విమర్శించాయి. ప్రజాస్వామ్యంలో భారత రాజ్యంగం సుప్రీం అని, రాష్ట్రపతి అయినా ప్రధాని, గవర్నర్లు అయినా దానికి అతీతులు కారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. పెండింగ్ బిల్లులపై గడువులోగా రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సరైన సమయంలో సాహసోపేతమైన తీర్పు ఇచ్చిందని అన్నారు.


టీఎంసీ నేత కల్యాణ్ బెనర్జీ సైతం ఇదేతరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై గౌరవం లేకుండా ఉపరాష్ట్రపతి మాట్లాడుతున్నారని అన్నారు. సుప్రీంకోర్టు జడ్జిలపై ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని, కోర్టు ధిక్కారానికి పాల్పడటమేనని వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇతర రాజ్యాంగ సంస్థల గౌరవాన్ని కాపాడాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థపై ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు అనైతకమని డీఎంకే నేత తిరుచ్చి శివ అన్నారు. సంపూర్ణ న్యాయం కోసం సుప్రీంకోర్టుకు రాజ్యంగం అధికారం ఇచ్చిందని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ అన్నారు. ఉపరాష్ట్రపతి వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరమని వ్యాఖ్యానించారు.


బీజేపీ స్పందన

కాగా, ఉపరాష్ట్రపతి అభిప్రాయానికి సమర్ధనగా బీజేపీ ప్రతినిధి షహజాద్ పూనావాలా స్పందించారు. విపక్ష పార్టీల హిపోక్రసీని తప్పుపట్టారు. పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయమని చెప్పిన వాళ్లు, ఉపరాష్ట్రపతిని హేళన చేసిన వారు, ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అల్లర్లకు పాల్పడేవాళ్లని కాపాడేవారు, బెంగాల్‌లో హిందూ బాధితులను పరామర్శించేందుకు కూడా తీరిక లేని వాళ్లు రాజ్యాంగ ఔన్నత్యం గురించి మాట్లాడటం హాస్పాస్పదమని అన్నారు. ఇలాంటి వాళ్ల నుంచి తాము పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా లేమన్నారు.


జగదీప్ ధన్‌ఖడ్ ఏమన్నారంటే?

రాష్ట్రపతిని ఆదేశించే విధంగా న్యాయ వ్యవస్థ వ్యహరించడాన్ని జగ్‌దీప్ ధన్‌ఖడ్ వ్యతిరేకంచారు. రాజ్యాంగంలోని 142వ అధికరణ ద్వారా సుప్రీంకోర్టుకు ప్రత్యేక అధికారాలు వర్తిస్తాయని, అయితే ఆ అధికరణ ప్రజాస్వామ్య వ్యవస్థలపై న్యూక్లియర్ మిజైల్స్ తరహాలో వాడుతున్నారని ఆరోపించారు. డెడ్‌లైన్ ప్రకారం పనిచేయాలని రాష్ట్రపతిని ఆదేశించడం సరికాదన్నారు. జడ్జీలే శాసనసభ వ్యవహారాలు చూస్తున్నట్టు, ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమలు చేస్తు్నట్టు, సూపర్ పార్లమెంటును నిడిపిస్తున్నట్టు ఉందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 145(3) ప్రకారం మాత్రమే రాజ్యాంగాన్ని ప్రశ్నించే హక్కు ఉంటుందని, ఇందుకు ఐదు, అంతకుమించి ఎక్కువ మంది జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలని అన్నారు.


ఇవి కూడా చదవండి..

Murshidabad Violence: రాష్ట్రం తగులబడుతుంటే ఆ ఎంపీ ఏమైనట్టు?

India: బెంగాల్ ఘటనలపై బంగ్లా అనుచిత వ్యాఖ్యలు.. ఖండించిన భారత్..

PM Modi-Elon Musk: ఎలాన్ మస్క్‌తో టెక్ సహకారంపై మాట్లాడిన ప్రధాని మోదీ

Updated Date - Apr 19 , 2025 | 12:29 PM