Share News

Chennai: ఏ తల్లి కన్నబిడ్డో.. చెట్ల పొదల్లో నవజాత శిశువు

ABN , Publish Date - Jun 13 , 2025 | 11:37 AM

తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి వెనుకనున్న ఖాళీ స్థలంలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పారేశారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి వెనుక ఖాళీ స్థలం నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అక్కడి స్థానికులు వెళ్ళిచూడగా, చెట్లపొదల్లో ఓ పసిబిడ్డ కనిపించింది.

Chennai: ఏ తల్లి కన్నబిడ్డో.. చెట్ల పొదల్లో నవజాత శిశువు

చెన్నై: తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి ప్రభుత్వాస్పత్రి వెనుకనున్న ఖాళీ స్థలంలో నవజాత శిశువును గుర్తుతెలియని వ్యక్తులు పారేశారు. వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రి(Tiruttani Govt Hospital) వెనుక ఖాళీ స్థలం నుంచి పసిబిడ్డ ఏడుపు వినిపించడంతో అక్కడి స్థానికులు వెళ్ళిచూడగా, చెట్లపొదల్లో ఓ పసిబిడ్డ కనిపించింది.


దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ బిడ్డను ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల అత్యవసర వార్డుకు తరలించారు. ప్రస్తుతం ఆ బిడ్డ క్షేమంగా ఉందని, వైద్యులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెట్ల పొదల్లో బిడ్డను పారేసిన వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి.

9 నెలల్లోనే జనాభా లెక్కలు రెడీ

రోడ్డు నిర్మించకుండానే బిల్లుల మంజూరు

Read Latest Telangana News and National News

Updated Date - Jun 13 , 2025 | 11:37 AM