Share News

Mumbai Shocker: ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు.. మరీ నీచంగా..

ABN , Publish Date - May 19 , 2025 | 06:18 PM

Mumbai Shocker: గత కొంత కాలం నుంచి 19 ఏళ్ల ఓ యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. గత రాత్రి ఆ తల్లి, ప్రియుడు రాక్షసుల్లా మారిపోయారు.

Mumbai Shocker: ఇలాంటి తల్లి ఎవ్వరికీ ఉండకూడదు.. మరీ నీచంగా..
Mumbai Shocker

ప్రియుడి మోజులో పడి ఓ తల్లి మానవత్వం మరిచి పోయింది. పసి పాపపై దారుణానికి పాల్పడింది. ఏ తల్లీ చేయకూడని నీచానికి ఒడికట్టింది. కన్న కూతురిపై ప్రియుడితో అత్యాచారం చేయించింది. దీంతో పాప చనిపోయింది. ఈ దారుణ సంఘటన ముంబైలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబై, మల్వానీకి చెందిన 30 ఏళ్ల మహిళను మూడేళ్ల క్రితం భర్త వదిలేశాడు. ఆ సమయంలో ఆమె గర్భంతో ఉంది. భర్త దూరంగా వెళ్లిపోయిన తర్వాత ఓ పాపకు జన్మనిచ్చింది.


ఆ మహిళ పుట్టింటి దగ్గర ఉంటోంది. గత కొంత కాలం నుంచి 19 ఏళ్ల ఓ యువకుడితో సంబంధం కొనసాగిస్తోంది. ఇద్దరూ తరచుగా ఏకాంతంగా కలుస్తూ ఉండేవారు. గత రాత్రి ఆ తల్లి, ప్రియుడు రాక్షసుల్లా మారిపోయారు. ఆ యువకుడు తల్లి కళ్ల ముందే కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక తీవ్రంగా గాయపడింది. కేకలు వేస్తూ అక్కడికక్కడే చనిపోయింది. బాలిక ఉలుకు, పలుకు లేకుండా పడిపోవటంతో భయపడిపోయిన తల్లి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది.


అక్కడి వైద్యులు పాపను పరీక్షించారు. అత్యాచారం కారణంగా పాప చనిపోయిందని ధ్రువీకరించారు. ఆ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆస్పత్రికి వచ్చారు. పాప మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పాప తల్లిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె అసలు విషయాలు బయటపెట్టింది. ఇద్దరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Shilpa Shirodkar: సూపర్ స్టార్ మహేష్ బాబు మరదలికి కోవిడ్

Great Man Marulayya: చరిత్ర మర్చిపోయిన వీరుడు.. 6 వేల శవాలకు అంత్యక్రియలు చేశాడు..

Updated Date - May 19 , 2025 | 06:18 PM