All Party MP Delegations: ఇక, పాక్ బ్రతుకు బట్టబయలు.. కేంద్రం కొత్త స్ట్రాటజీ
ABN , Publish Date - May 16 , 2025 | 06:00 PM
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్ తీసుకోబోతోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని

All Party MP Delegation: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ సహా ఇప్పటికే అనేక తక్షణ చర్యలు చేపట్టిన భారత్ ఇప్పుడు కొత్త ఇనీషియేటివ్ తీసుకోబోతోంది. ప్రపంచం ముందు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని బట్టబయలు చేయబోతోంది. పహల్గాంలో 26 మంది ప్రాణాలు బలిగొన్న ఉదంతాన్ని, అనంతరం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గురించి.. ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత ప్రభుత్వం అన్ని పార్టీల ఎంపీ ప్రతినిధుల బృందాన్ని విదేశాలకు పంపనుంది. కశ్మీర్పై పాకిస్తాన్ దురాగతాన్ని తిప్పికొట్టడానికి, పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదాన్ని బహిర్గతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించారు.
ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యుల (ఎంపీలు) ప్రతినిధులను కీలకమైన ప్రపంచ రాజధానులకు పంపడానికి సన్నాహాలు చేస్తోంది. ఉగ్రవాద దాడులపై భారతదేశ దృక్పథాన్ని ప్రదర్శించడం, నిరంతర సీమాంతర ఉగ్రవాద బాధితురాలిగా భారతదేశం ఎదుర్కొంటున్న సవాళ్లని ప్రపంచానికి చాటి చెప్పడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఇతర సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఈ కార్యక్రమం చేపడతారు.
దీంతో ఇప్పుడు.. సరిహద్దుల ఆవల నుంచి పుట్టుకొచ్చే ఉగ్రవాదంపై భారత్ తన వాణిని ప్రపంచ దేశాల ముందు బలంగా వినిపించబోతోంది. ఈ దౌత్య ప్రచారానికి మద్దతు ఇవ్వడానికి విదేశాలలో ఉన్న భారత మిషన్లు పార్లమెంటరీ బృందాలతో కలిసి పనిచేస్తాయి. ఈ బృందంలో అధికార బీజేపీ ఎంపీలతో పాటు, కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తదితరులు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కేంద్రం త్వరలోనే అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. భారత్ ఈ తరహా కార్యక్రమం చేపట్టడం ఇదే తొలిసారి.
ఇవి కూడా చదవండి
SIT Investigation: రెండో రోజు సిట్ కస్టడీకి సజ్జల శ్రీధర్
Pakistan Occupied Kashmir: పీవోకేలో ఏముందీ.. సొంతమైతే భారత్కు కలిగే ప్రయోజనాలేంటో తెలుసా..
Read Latest AP News And Telugu News
సమంత రేర్ లుక్