Minister Sanjay Sharma: ఇదేం పని మంత్రి గారూ.. సమస్య తిర్చమంటే ఫోన్ లాక్కుంటారా..
ABN , Publish Date - May 05 , 2025 | 08:00 AM
Minister Sanjay Sharma: ఓ మీటింగ్ తర్వాత కన్హయ్య లాల్తో పాటు అడవులు, పర్యావరణ శాఖ మంత్రి సంజయ్ శర్మ బయటకు వచ్చారు. వీరిని ఆఖేపుర మొహల్లాకు చెందిన మహిళలు, యువకులు చుట్టు ముట్టారు. తమ సమస్య గురించి వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు.

ఎన్నికల ముందు ఓట్ల కోసం రాజకీయ నాయకులు జనాల చుట్టూ తిరగటం.. ఎన్నికల తర్వాత జనాలు వారి చుట్టూ తిరగటం సర్వ సాధారణ విషయం. ఏదైనా సమస్య ఉండి.. దాని గురించి చెబుదామంటే ఓట్లు వేసి గెలిపించిన వ్యక్తి మళ్లీ ఊర్లోకి అడుగు కూడా పెట్టడు. ఆయన దగ్గరకు వెళితే.. ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. తాజాగా, రాజస్థాన్కు చెందిన ఓ మంత్రి.. సమస్య గురించి అడగడానికి వచ్చిన యువకుడితో కరుకుగా ప్రవర్తించాడు. సమస్య గురించి స్పందించాల్సింది పోయి.. అతడి ఫోన్ లాక్కున్నాడు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్లోని ఆఖేపుర మొహల్లాకు చెందిన ప్రజలు గత కొంతకాలంనుంచి తీవ్రమైన నీటి సమస్యతో బాధపడుతున్నారు. సమస్య గురించి అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వారు నీటి వనరుల శాఖ మంత్రి కన్హయ్య లాల్ చౌదరిని కలవడానికి మినీ సెక్రటేరియట్కు వెళ్లారు. ఓ మీటింగ్ తర్వాత కన్హయ్య లాల్తో పాటు అడవులు, పర్యావరణ శాఖ మంత్రి సంజయ్ శర్మ బయటకు వచ్చారు. వీరిని ఆఖేపుర మొహల్లాకు చెందిన మహిళలు, యువకులు చుట్టు ముట్టారు. తమ సమస్య గురించి వారిని ప్రశ్నిస్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే లోకేష్ భైరవతో పాటు మరికొంతమంది వీడియో తీస్తూ ఉన్నారు. ఇది మంత్రి సంజయ్ శర్మకు నచ్చలేదు. వీడియో తీస్తున్న లోకేష్ ఫోన్ను లాక్కున్నాడు. అక్కడే ఉన్న మిగిలిన వారు సర్థి చెప్పటంతో ఫోన్ వదిలేశాడు. మంత్రితో పాటు ఉన్న ఓ వ్యక్తి గ్రామస్తుల్ని అక్కడినుంచి వెళ్లిపొమ్మన్నాడు. మంత్రులు కూడా తమ కారుల్లో అక్కడినుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు మంత్రి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Fighting Over Tandoori Roti: మరీ ఇంత దారుణమా.. తందూరీ రోటీ కోసం కొట్టికుని చచ్చారు