Honeymoon Murder: సోనమ్ను ఉరి తీయాలి.. ఆమెతో మాకు సంబంధం లేదు: సోనమ్ సోదరుడు
ABN , Publish Date - Jun 11 , 2025 | 06:50 PM
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించానని సోనమ్ అంగీకరించినట్టు సమాచారం. తన భర్త హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు సోనమ్ అంగీకరించిందని సిట్ వర్గాలు చెబుతున్నాయి.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు (Meghalaya Murder case) దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. తన భర్త రాజా రఘువంశీని తానే హత్య చేయించానని సోనమ్ అంగీకరించినట్టు సమాచారం. తన భర్త హత్యలో తన ప్రమేయం ఉన్నట్టు సోనమ్ అంగీకరించిందని సిట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సోనమ్ సోదరుడు గోవింద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన సోదరే ఈ హత్య చేసినట్టు తాను నమ్ముతున్నానని, ఆమెను ఉరి తీయాలని గోవింద్ వ్యాఖ్యానించాడు (Crime News).
రాజా రఘువంశీ కుటుంబ సభ్యులను కలుసుకున్న గోవింద్ వారిని ఓదార్చాడు. వారికి క్షమాపణలు తెలియజేశాడు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను చూస్తుంటే రాజా రఘువంశీ హత్యలో తన సోదరి ప్రమేయం ఉన్నట్టు అర్థమవుతోందని, ఆమెతో తమ కుటుంబం సంబంధాలు తెంచుకుందని గోవింద్ అన్నాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వాళ్లందరూ సోనమ్ స్నేహితుడు రాజ్ కుశ్వాహాకు తెలిసిన వాళ్లే అని గోవింద్ ధ్రువీకరించాడు. ఈ కేసులో దోషిగా తేలితే తమ సోదరిని ఉరి తీయాలని గోవింద్ అన్నాడు.
కాగా, రాజా రఘువంశీ కేసులో నిందితులందరినీ పోలీసులు బుధవారం షిల్లాంగ్ తీసుకెళ్లారు. అక్కడ సిట్ బృందం వీరిని విచారించింది. వారి ఎదుట సోనమ్ తన నేరాన్ని అంగీకరించినట్టు సమాచారం. దీంతో మెజిస్ట్రేట్ ఎదుట సోనమ్ వాంగ్మూలాన్ని రికార్డు చేయాలని, దానిని వీడియో టేప్ చేయాలని పోలీసులు భావిస్తున్నారు. సోనమ్ వాంగ్మూలం ఆధారంగా ఈ కేసు దాదాపు కొలిక్కివచ్చేలాగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
రాజాతో పెళ్లి.. తల్లికి ముందే వార్నింగ్ ఇచ్చిన సోనమ్..
తిరువణ్ణామలైలో మాంసాహార భోజనం..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి