Chennai: తిరువణ్ణామలైలో మాంసాహార భోజనం..
ABN , Publish Date - Jun 11 , 2025 | 11:41 AM
ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయంలో దంపతులు మాంసాహారం తినడంపై ఆందోళనకు గురైన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజలు చేయించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తుంటారు.

- పరిహార పూజలు
చెన్నై: ప్రముఖ శైవక్షేత్రం తిరువణ్ణామలై అరుణాచలేశ్వరాలయం(Tiruvannamalai Arunachaleshwaralayam)లో దంపతులు మాంసాహారం తినడంపై ఆందోళనకు గురైన ఆలయ అధికారులు ప్రక్షాళన పూజలు చేయించారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులను తనిఖీ చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తుంటారు. ఈ నేపథ్యంలో, రాజగోపురం సమీపంలోని ఐదో ప్రాకారంలో సోమవారం ఓ జంట ఆలయ పవిత్రతకు భంగం కలిగించేలా మాంసాహార ఆరగిస్తుండగా, అటువైపు వెళ్లిన భక్తులు దీనిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశారు.
తక్షణ చర్యలు చేపట్టిన అధికారులు ఆ దంపతులను పోలీసులకు అప్పగించారు. విచారణ అనంతరం ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడరాదని ఆ దంపతులను పోలీసులు హెచ్చరించి పంపించారు. ఈ నేఫథ్యంలో, మంగళవారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో శివాచార్యులు పరిహార పూజలు నిర్వహించారు. దంపతులు మాంసాహారం తిన్న ప్రాంతం సహా ఆలయ ప్రాంగణం అంతా పవిత్ర జలాలను సంప్రోక్షించారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి గుడ్న్యూస్
రాజీవ్ యువ వికాసం మరింత జాప్యం
Read Latest Telangana News and National News