Chennai: 24నుంచి కొడైకెనాల్లో 62వ పుష్ప ప్రదర్శన
ABN , Publish Date - May 20 , 2025 | 12:01 PM
ఈనెల 24వతేదీ నుంచి కొడైకెనాల్లో 62వ పుష్ప ప్రదర్శన ప్రారంభం కానుంది. జూన్ 1వ తేదీ వరకు 9 రోజులపాటు ఈ ప్రదర్శన జరుగుతుంది. కాగా.. నెమలి, దిండుగల్ తాళం, కొండ వెల్లుల్లి సహా పలు నమూనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.

చెన్నై: కొడైకెనాల్(Kodaikanal)లో ఈనెల 24నుంచి 62వ పుష్ప ప్రదర్శన ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన వేసవి విడిది కేంద్రాల్లో ఒకటైన దిండుగల్ జిల్లా కొడైకెనాల్కు రాష్ట్రం సహా పొరుగు రాష్ట్రాలు, విదేశాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా, వేసవి ఎండల నుంచి సేదతీరేందుకు కుటుంబాలతో వస్తున్న పర్యాటకులతో కొడైకెనాల్ సందడిగా మారుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: Chief Minister: కారులోనే.. ముఖ్యమంత్రి భోజనం
పర్యాటకులకు మరింత ఆహ్వానం అందించేలా ఉద్యాన, పర్యాటక శాఖలు వివిధ రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేస్తుంటాయి. ఈ విషయమై దిండుగల్ జిల్లా కలెక్టర్ శరవణన్ విడుదల చేసిన ప్రకటనలో... ఈ నెల 24న ప్రారంభం కానున్న పుష్ప ప్రదర్శన జూన్ 1వ తేది వరకు 9 రోజులు జరుగుతుందన్నారు. పుష్ప ప్రదర్శనతో పాటు డాగ్ షో, పడవ పోటీలు, చేపలు పట్టే వేడుకలు సహా పలు కార్యక్రమాలు ఏర్పాటవుతున్నాయని తెలిపారు.
బ్రయాంట్ పార్కులో ప్రారంభం కానున్న పుష్ప ప్రదర్శనలో సాల్వియా, డెల్ఫీనియం, జినియా, పింక్ఆస్టా, బెన్స్టీమన్ తదితర విదేశీ పూల రకాలు ప్రదర్శనలో ఉంటాయి. నెమలి, దిండుగల్ తాళం, కొండ వెల్లుల్లి సహా పలు నమూనాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయని కలెక్టర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
Gold Rates Today: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు
Rice Production: సస్యశ్యామల భారతం
Siricilla : పాత బకాయిలు లేనట్లేనా..?
Telangana fire services: ఇక.. మహిళా ఫైర్ఫైటర్లు
Read Latest Telangana News and National News