Share News

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..

ABN , Publish Date - Jun 07 , 2025 | 08:37 PM

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌‌నాథ్ షిండే ఫ్లైట్ ఆలస్యం కావడం ఓ మహిళా రోగికి వరంగా మారింది. తన ఫ్లైట్ మిస్సైనా ఆమె చివరకు డిప్యూటీ సీఎం చార్టెడ్ విమానంలో ఆపరేషన్ కోసం సకాలంలో ముంబైకి చేరుకోగలిగింది.

Eknath Shinde: ఏక్‌నాథ్ షిండే గొప్ప మనసు.. పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు..
Eknath Shinde

ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తన గొప్ప మనసు చాటుకున్నారు. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం ఓ రోగిని తన చార్టెర్డ్ ప్లేన్‌లో సకాలంలో ఆసుపత్రికి చేర్చారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం, శీతల్ అనే మహిళకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ జరగాల్సి ఉంది. అయితే, శుక్రవారం ఆమె తన ఫ్లైట్ మిస్సయ్యింది. దీంతో, బాధితురాలు చీఫ్ మినిస్టర్ మెడికల్ అసిస్టెన్స్ సెల్‌ను సంప్రదించి సహాయం అర్థించింది. సకాలంలో ఆసుపత్రికి చేరకపోతే కిడ్నీని మరో పేషెంట్‌కు అమర్చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.

విషయం తెలిసిన డిప్యూటీ సీఎం మహిళకు ఆపన్న హస్తం అందించారు. అప్పటికి ఆయన చార్టడ్ విమానంలో ముంబైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. సదరు మహిళ విషయం తెలియగానే ఆమెనూ తన విమానంలో తీసుకెళ్లారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకునేలా చేశారు. ఈ విషయాన్ని జల్‌గావ్ కలెక్టర్ ఆయుష్ ప్రసాద్ తెలిపారు.

ఆషాఢ ఏకాదశిని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు డిప్యూటీ సీఎం జల్‌గావ్‌కు వచ్చారు. అనంతరం ఆయన మళ్లీ జల్‌గావ్ ఎయిర్‌పోర్టుకు తిరిగొచ్చేసరికి ఆలస్యమైంది. అప్పటికే పైలట్, కోపైలట్‌ల డ్యూటీ అవర్స్ ముగిశాయి. దీంతో, మళ్లీ అనుమతులు లభిస్తే తప్ప వారు విమానం నడపలేమని అశక్తత వ్యక్తం చేశారు. ఇదే సమయంలో మహిళా పేషెంట్ విషయం అధికారులకు తెలిసింది.


ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌డీ మంత్రి గిరీశ్ మహాజన్.. సివిల్ ఏవియేషన్ అధికారులతో సంప్రదింపుల తర్వాత అనుమతులు లభించాయి. పైలట్‌లకు వైద్య పరీక్షల అనంతరం విమానం బయలుదేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతరం, మహిళా రోగిని డిప్యూటీ సీఎం తన చార్టెడ్ ఫ్లైట్‌లో సకాలంలో ముంబైకి చేరేలా సహాయం అందించారు.


పైలట్‌ల డ్యూటీ కాలం ముగిసిన నేపథ్యంలో పలు ప్రత్యామ్నాయాలపై కూడా చర్చించామని కలెక్టర్ తెలిపారు. ఆ రాత్రి జల్‌గావ్‌లోనే ఉండేందుకు డిప్యుటీ సీఎం కూడా సిద్ధమయ్యారని చెప్పారు. అవసరమైతే ఛత్రపతి శంభాజీనగర్ నుంచి మరో పైలట్‌ను కూడా ఏర్పాటు చేసి ఉండేవారమని పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

సింధు నదీ జలాల ఒప్పందం నిలుపుదలతో పాక్‌కు చుక్కలు.. భారత్‌కు వరుస లేఖలు

పుతిన్ సాయం కోరిన పాక్.. మీ ఇన్‌ఫ్లుయెన్స్ వాడండని విజ్ఞప్తి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 07 , 2025 | 08:51 PM