Share News

Coffee Quality: కాఫీ విషయంలో గొడవ.. కనిపించకుండా పోయిన భార్యాభర్తలు..

ABN , Publish Date - Jun 04 , 2025 | 01:57 PM

Coffee Quality: పోలీసుల దర్యాప్తులో భయానక విషయాలు వెలుగు చూశాయి. రాఘువంశీని ఎవరో చంపేశారు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి ప్రాణాలు తీశారు. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Coffee Quality: కాఫీ విషయంలో గొడవ.. కనిపించకుండా పోయిన భార్యాభర్తలు..
Coffee Quality

మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీకి సోనమ్ అనే యువతితో ఇది వరకే పెళ్లయింది. కొద్దిరోజుల క్రితం భార్యాభర్తలిద్దరూ హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. ఓ చల్లటి సాయంత్రం రఘువంశీ, సోనమ్ కాఫీ షాపుకు వెళ్లారు. అక్కడ కాఫీ టేస్ట్ విషయంలో రఘువంశీకి, షాపు వాళ్లకు మధ్య గొడవ జరిగింది. కొట్టుకునే వరకు వెళ్లింది. కట్ చేస్తే మరుసటి రోజు నుంచి భార్యాభర్తలిద్దరూ కనిపించకుండా పోయారు. రఘువంశీ నుంచి కానీ, సోనమ్ నుంచి కానీ కాల్స్ రాకపోవటం.. కాల్స్ చేస్తే వారి ఫోన్లు స్విచ్ఛాఫ్ రావటంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది.


పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో భయానక విషయాలు వెలుగు చూశాయి. రాఘువంశీని ఎవరో చంపేశారు. కత్తితో అతి కిరాతకంగా పొడిచి ప్రాణాలు తీశారు. పోలీసులు రఘువంశీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సోనమ్ ఆచూకీ ఇంకా లభించలేదు. పోలీసులు ఆమె కోసం వెతుకుతున్నారు. ఈస్ట్ కాశీ హిల్స్ డిస్ట్రిక్ట్ పోలీస్ చీఫ్ వివేక్ సియేమ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ..


‘మేము ఓ కత్తిని రికవర్ చేశాము. అది కొత్త కత్తి. కేవలం హత్య కోసమే దాన్ని కొన్నట్లు అర్థం అవుతోంది. రఘువంశీ హత్యకు గురయ్యాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. మేము మర్డర్, డిస్ట్రక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ కింద కేసులు నమోదు చేశాము. దర్యాప్తు చేస్తున్నాము. హత్యకు కారణం ఏంటో ఇంకా తెలియలేదు’ అని అన్నారు. రఘువంశీ హత్యకు గురయ్యాడని తెలిసి అతడి కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. రఘువంశీ అన్న మాట్లాడుతూ.. ‘ నా తమ్ముడు హత్యకు గురయ్యాడు.


మాకు హోటల్ సిబ్బంది, లోకల్ గైడ్స్, స్కూటర్ రెంటుకు ఇచ్చే వాళ్ల మీదే అనుమానంగా ఉంది. వాళ్లందరినీ విచారించాలి. నేను నా తమ్ముడ్ని కోల్పోయాను. మరదలిని కోల్పోవాలని అనుకోవటం లేదు. ప్రభుత్వం ఎలాగైనా ఆమెను కనిపెట్టాలి’ అని అన్నాడు. రఘువంశీ ఎందుకు హత్యకు గురయ్యాడు.. ఎవరు చంపారు.. సోనమ్ ఏమైంది.. అన్న విషయాలు ఇప్పటికైతే మిస్టరీగా మిగిలిపోయాయి. కాఫీ విషయంలో గొడవ ఈ దారుణాలకు తెర తీసిందా అన్న సంగతి తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి

కర్ణాటక సీఎం టు రణ్‌వీర్ సింగ్.. ఆర్సీబీ విజయంపై ప్రముఖులు ఏమన్నారంటే..

18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ విజయం.. హైదరాబాద్‌లో సందడి మామూలుగా లేదు..

Updated Date - Jun 04 , 2025 | 02:06 PM