Share News

Indian Railway: రైలు ప్రయాణంలో ఈ కాయ నిషేధం.. దీనిని తీసుకెళ్లితే జైలు శిక్ష తప్పదు..

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:01 PM

భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ఏ ఏ వస్తువులను రైలులో తీసుకెళ్లకూడదో మీకు తెలుసా? ఈ నిబంధనలను ఉల్లంఘించి రైలు ప్రయాణం చేస్తే కఠిన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి, రైలు ప్రయాణంలో వేటిని మనం తీసుకెళ్లడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

Indian Railway: రైలు ప్రయాణంలో ఈ కాయ నిషేధం.. దీనిని తీసుకెళ్లితే జైలు శిక్ష తప్పదు..
Indian Railways

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ ఉన్న దేశాలలో ఇండియన్ రైల్వే నాల్గవ స్థానంలో ఉంది. ప్రయాణీకులకు సౌకర్యాలు కల్పించడంలో ఇండియన్ రైల్వే ప్రత్యేకమైన పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రయాణీకుల ప్రయాణ సమయంలో కొన్ని నియమాలను విధించింది. ఈ రైల్వే నియమాలను ప్రతి ప్రయాణీకుడు తప్పనిసరిగా పాటించాల్సిందే. లేదంటే కఠినమైన శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం మీరు ఏ ఏ వస్తువులను రైలులో తీసుకెళ్లకూడదు? ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..


రైల్వే నియమాలు

  • ప్రయాణికుడు ఎట్టిపరిస్థితిలోనూ స్టవ్‌లు, గ్యాస్ సిలిండర్లు, మండే రసాయనాలు, బాణసంచా, గ్రీజు, సిగరెట్లు, పేలుడు పదార్థాలు వంటి దుర్వాసన వచ్చే పదార్థాలను రైళ్లలో తీసుకెళ్లకూడదు.

  • నిబంధనల ప్రకారం, రైలులో గ్యాస్ సిలిండర్‌లను తీసుకెళ్లడం నిషేధం. అయితే, వైద్య అత్యవసర పరిస్థితిలో ఆక్సిజన్ సిలిండర్ల కోసం రైల్వే వివిధ సౌకర్యాలను కల్పిస్తుంది.

  • రైల్వే నిబంధనల ప్రకారం హైడ్రోక్లోరిక్ యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్, నూనె, గ్రీజు మొదలైన ప్రమాదకరమైన ద్రవాలను తీసుకెళ్లడం నిషేధించింది.

  • ప్రయాణీకుడు పెంపుడు జంతువును తనతో తీసుకెళ్లాలనుకుంటే అందుకు ప్రత్యేక నియమాలు ఉన్నాయి.

  • అంతేకాకుండా, రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎట్టిపరిస్థితిలోనూ టెంకాయను తీసుకెళ్లకూడదు. ఎందుకంటే, ఎండిన కొబ్బరికాయ బయటి భాగం గడ్డి వంటి పీచు పదార్థంతో ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందువల్ల, రైలు ప్రయాణంలో టెంకాయను నిషేధించారు.

  • రైల్వే నిబంధనల ప్రకారం, ప్రయాణీకుడు మద్యం సేవించి లేదా మాదకద్రవ్యాలతో రైలులో ప్రయాణించకూడదు. 1989 రైల్వే చట్టం దీని కోసం సెక్షన్ 165 కింద కఠినమైన చట్టాలను ఏర్పాటు చేసింది. ప్రయాణీకుడు ఎవ్వరైనా సరే మత్తు పదార్థాలను సేవించడం, మత్తులో ఉండటం, ఆటంకాలు సృష్టించడం లేదా రైలు ప్రాంగణంలో ఇతర ప్రయాణీకులను వేధించడానికి ప్రయత్నించడం కనిపిస్తే, వారి టికెట్‌ను తక్షణమే రద్దు చేసే నియమం ఉంది. అంతేకాకుండా, ప్రయాణీకుడు రైల్వే పాస్ హోల్డర్ అయితే వారి పాస్‌ను కూడా రద్దు చేయవచ్చు. నియమం ప్రకారం, దోషిగా తేలితే ఆ వ్యక్తికి 6 నెలల జైలు శిక్ష, 500 రూపాయల జరిమానా విధిస్తారు.

  • రైలులో నిషేధిత వస్తువులతో ప్రయాణీకుడు పట్టుబడితే రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రయాణీకుడికి రూ. 1,000 జరిమానా, రెండు లేదా మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించవచ్చు. నిషేధిత వస్తువుల కారణంగా రైల్వే ఆస్తికి ఏదైనా నష్టం జరిగితే, ఆ ప్రయాణీకుడు జరిగిన నష్టానికి అయ్యే ఖర్చును కూడా భరించాల్సి ఉంటుంది.


Also Read:

Pahalgam Terror Attack: సిగ్గుతో తలవంచుకోవాలి.. పహల్గాం దాడిపై జమ్మూకశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసనలు

Dhirubhai Ambani: రూ.300 జీతం నుంచి వేల కోట్ల ఆదాయం.. కొడుకులకు ధీరూభాయ్ అంబానీ ఎంత ఆస్తిని వదిలివెళ్లాడో తెలుసా..

Updated Date - Apr 23 , 2025 | 05:07 PM