Share News

Adani Group: ఆపరేషన్‌ సిందూర్‌లో అదానీ డ్రోన్లు

ABN , Publish Date - May 13 , 2025 | 05:31 AM

ఆపరేషన్‌ సిందూర్‌లో అదానీ గ్రూపు తయారు చేసిన స్కైస్ర్టైకర్‌ డ్రోన్లు భారత్‌ పాక్‌పై దాడులను తిరిగిపెట్టేందుకు ఉపయోగించాయి. ఈ డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలో లక్ష్యాలను తగులుతాయి, భారత ఆర్మీకి సరఫరా చేస్తోంది.

 Adani Group: ఆపరేషన్‌ సిందూర్‌లో అదానీ డ్రోన్లు

  • స్కైస్ర్టైకర్లతో పాక్‌ను దెబ్బకొట్టిన భారత్‌

న్యూఢిల్లీ, మే 12: అదానీ గ్రూపునకు చెందిన ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ అభివృద్ధి చేసిన స్కైస్ర్టైకర్‌ డ్రోన్లు ఆపరేషన్‌ సిందూర్‌లో సత్తాచాటాయి. భారత్‌లోని అనేక నగరాలపై పాక్‌ చేసిన దాడులను తిప్పికొడుతూనే.. భారత్‌ మరిన్ని క్షిపణి, డ్రోన్‌ దాడులకు దిగింది. ఈ క్రమంలో కామికేజ్‌ డ్రోన్లుగా పిలిచే స్కైస్ర్టైకర్‌ డ్రోన్లను వినియోగించింది. ఈ డ్రోన్లను బెంగళూరులోని అదానీ గ్రూపు సంస్థ ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌, ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్‌ సెక్యూరిటీ సిస్టమ్స్‌ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ అధునాతన డ్రోన్లు 100 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలపై దాడిచేసేందుకు వినియోగిస్తున్నారు. ఆల్ఫా డిజైన్‌ టెక్నాలజీస్‌ సంస్థ వీటిని భారత ఆర్మీకి సరఫరా చేస్తోంది. 5 నుంచి 10 కేజీల మందుగుండును తీసుకెళ్లే విధంగా వీటిని రూపొందించారు. స్కైస్ర్టైకర్‌ మానవరహిత విమాన వ్యవస్థలా గాలిలోకి ఎగిరి, క్షిపణిలా దాడి చేస్తుంది. ఇది నిర్దేశిత ప్రాంతంపై తిరుగుతూ.. లక్ష్యాలను గుర్తించి విరుచుకుపడుతుంది. తక్కువ శబ్ధం చేస్తుంది కాబట్టి.. తక్కువ ఎత్తులో ఎగిరినా శుత్రువు గుర్తించడం కష్టం.

Updated Date - May 13 , 2025 | 05:34 AM