Randhir Jaiswal: బంగ్లాలో అవామీలీగ్ పార్టీ నిషేధంపై భారత్ ఆందోళన
ABN , Publish Date - May 13 , 2025 | 09:03 PM
బంగ్లాదేశ్లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది. సవరించిన ఉగ్రవాద చట్టం కింద గత సోమవారంనాడు ఈ పార్టీని అధికారికంగా నిషేధించారు.

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో అవామీ లీగ్ (Awami League) పార్టీని నిషేధించడంపై భారత్ (India) ఆందోళన తెలిపింది. ప్రజాస్వామ్య స్వేచ్ఛను బలహీన పరిచే ఇబ్బందికర పరిణామంగా దీనిని పేర్కొంది. భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైశ్వాల్ (Randhir Jaiswal) మంగళవారంనాడిక్కడ మీడియాతో జరిపిన సమావేశంలో మాట్లాడుతూ, సరైన ప్రక్రియను పాటించకుండా అవామీ లీగ్పై నిషేధం విధించడం ఆందోళన కలిగించే పరిణామమని చెప్పారు. ప్రజాస్వామ్య హక్కులను, రాజకీయ పార్టీలకున్న అవకాశాన్ని కుదించడం సహజంగానే ప్రజాస్వామ్య దేశమైన భారత్కు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. బంగ్లాదేశ్లో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు జరిగేందుకు భారత్ మద్దతిస్తుందని చెప్పారు.
India Pak Ceasefire: సీజ్ఫైర్తో అంతా ముగిసినట్టు కాదు.. పాక్ కొత్త మెలిక
సవరించిన ఉగ్రవాద చట్టం కింద..
బంగ్లాదేశ్లోని సుదీర్ఘ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీ అవామీ లీగ్. 1971లో దేశ స్వాతంత్ర్య పోరాటానికి ఆ పార్టీ సారథ్యం వహించింది. సవరించిన ఉగ్రవాద చట్టం కింద గత సోమవారంనాడు ఈ పార్టీని అధికారికంగా నిషేధించారు. మహమ్మద్ యూనిస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్, దాని అనుబంధ సంస్థలపై నిషేధం వేటు వేసింది.
గతేడాది షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి కారణమైన సామూహిక నిరసనలపై తీవ్ర అణిచివేతకు హసీనా పాల్పడ్డారన్నది ఆమె మీదున్న ప్రధాన ఆరోపణ. ఈ అణిచివేతకు సంబంధించి బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసీటీ-బీజీ) తీర్పు ఇచ్చేంత వరకూ హసీనా పార్టీపై ఉన్న నిషేధం అమల్లో ఉంటుందని మహమ్మద్ యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: ఎస్-400తో ప్రధాని మోదీ ... పాకిస్థాన్కు హెచ్చరిక సందేశం..
Terrorists Trapped: జుమ్మూలో భారీ ఎన్ కౌంటర్.. ముగ్గురు లష్కర్ ఈ తోయిబా ఉగ్రవాదుల హతం
Operation Sindoor: అణువణువూ జల్లెడ పడుతున్న భారత్.. ఆచూకీ చెబితే 20 లక్షలు