Share News

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

ABN , Publish Date - May 31 , 2025 | 09:16 PM

మంత్రిత్వ శాఖ అధికార గణాంకాల ప్రకారం, కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి.

India Covid Cases: 3,000కు చేరిన కోవిడ్ యాక్టివ్ కేసులు.. టాప్‌లో ఆ రాష్ట్రం

న్యూఢిల్లీ: భారత్‌ (India)లో కొవిడ్ యాక్టివ్ కేసులు (Covid Cases) క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా ఈ సంఖ్య సుమారు 3,000కు చేరుకుంది. కేరళలో అత్యధికంగా కేసులు నమోదు కాగా, మహారాష్ట్ర, ఢిల్లీ ఆ తరువాత స్థానంలో ఉన్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం కొవిడ్ యాక్టివ్ కేసులు గత నలుగు రోజుల్లో వేగంగా పెరిగాయి. మే 26వ తేదీన భారత్‌లో 1,010 కేసులు నమోదు కాగా, మే 30వ తేదీకి 2,710కి చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అధికారిక డాటా వెల్లడించింది.


వివరాలిలా..

మంత్రిత్వ శాఖ అధికార గణాంకాల ప్రకారం, కేరళలో 1,147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్‌లో 223 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో ఇంతవరకూ 148 కేసులు నమోదు కాగా, కర్ణాటకలో 148, పశ్చిమబెంగాల్‌లో 116 కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్‌లో 51, ఉత్తరప్రదేశ్‌లో 42, హర్యానాలో 20, ఆంధ్రప్రదేశ్‌లో 16, మధ్యప్రదేశ్‌లో 10, గోవాలో 7, ఒడిసా, పంజాబ్, జమ్మూకశ్మీర్‌లో నాలుగేసి చొప్పున నమోదయ్యాయి. తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్‌లో మూడేసి చొప్పున కేసులు నమోదయ్యాయి. మిజోరం, అసోంలో రెండేసి కేసులు నమోదయ్యాయి. అండమాన్ నికోబార్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎలాంటి యాక్టివ్ కేసులు నమోదు కాలేదు. బీహార్‌కు సంబంధించి అధికారిక డేటా అందుబాటులో లేదు.


కాగా, దేశవ్యాప్తంగా 7 మరణాలు సంభవించినట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీలో ఒక్కొక్కరు చొప్పున మరణించగా, వీరికి కోవిడ్‌తో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్టు గుర్తించారు. తక్కిన ఐదుగురు కరోనా ఇన్‌ఫెక్షన్‌తోనే మరణించారా అనేది ఇంకా స్పష్టం కాలేదు. మరణించిన వారిలో పంజాబ్‌కు చెందిన ఒక వ్యక్తి మినహా తక్కిన వారంతా సీనియర్ సిటిజన్లేనని అధికారులు తెలిపారు. కాగా, ఒమైక్రాన్ వేరియంట్‌కు చెందిన ఎల్ఎఫ్.7, ఎన్‌బీ.1.8.1 అనే కరోనా సబ్ వేరియంట్ల వల్ల కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, ఆందోళన పడాల్సిన పని లేదని, బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

భారత్- పాక్ యుద్ధంలో ఫైటర్ జెట్లు కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 09:18 PM