Impeachment Motion: జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో అభిశంసన తీర్మానం
ABN , Publish Date - Jun 03 , 2025 | 09:35 PM
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా గత మార్చి 14న పెద్ద ఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడటం సంచలనమైంది. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని అధికారిక నివాసంలో పెద్దఎత్తున కాలిన నోట్ల కట్టలు దొరకడంతో వివాదాస్పదమైన అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ శర్మ (Yaswanta Sharma)పై పార్లమెంటులో అభిశంసన తీర్మానం పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని పార్టీలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం ఈ తీర్మానం ప్రవేశపెట్టనున్నట్టు చెబుతున్నారు. జస్టిస్ వర్మ స్వచ్ఛందంగా రాజీనామా చేయని పక్షంలో ఈ తీర్మానం సభ ముందుకు వస్తుందని అంటున్నారు. జులై మధ్యలో పార్లమెంటు సమావేశాలు జరగాల్సి ఉన్నాయి.
ఇదీ వివాదం..
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ యశ్వంత్ వర్మ పనిచేస్తుండగా గత మార్చి 14న పెద్దఎత్తున నోట్ల కట్టలు ఆయన నివాసంలో బయటపడటం సంచలనమైంది. ఈ ఘటన అనంతరం మార్చి 28న ఆయనను అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు కొలీజియం బదిలీ చేసింది. న్యాయపరమైన బాధ్యతలు అప్పగించవద్దని సూచించింది. అనంతరం ముగ్గురు న్యాయమూర్తులతో విచారణ కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా సారథ్యంలోని కమిటీ జస్టిస్ వర్మను తప్పుపట్టింది. ఆయన చర్యలు అనుచితమని, కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫారసు చేసింది. ఆయన రాజీనామా చేయాలని జస్టిస్ ఖన్నా సూచించగా జస్టిస్ వర్మ నిరాకరించారు. దీంతో జస్టిస్ వర్మపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రికి జస్టిస్ సంజీవ్ ఖన్నా సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
తప్పు చేసి భద్రత కోరుతున్నారా? కమల్పై కర్ణాటక హైకోర్టు ఫైర్..
శర్మిష్ఠ పనోలికి బెయిల్ నిరాకరించిన కోల్కతా హైకోర్టు
For National News And Telugu News