Share News

Dogs: ఆ నగరంలో మొత్తం వీధి కుక్కల సంఖ్య ఎంతో తెలిస్తే..

ABN , Publish Date - May 15 , 2025 | 01:27 PM

నగరంలో.. వీధికుక్కలు స్వైరవిహరం చేస్తున్నాయి. రాజధాని నగరం చెన్నైలోనే దాదాపు 1.80 లక్షల వీధి కుక్కలున్నాయని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు ప్రకటించారు. కాగా వీధి, పెంపుడు కుక్కలకు రాబిస్‌ ఇంజక్షన్లు వేయాలని అధికారులు నిర్ణయించారు.

Dogs: ఆ నగరంలో మొత్తం వీధి కుక్కల సంఖ్య ఎంతో తెలిస్తే..

- రాజధాని నగరంలో 1.80 లక్షల వీధి కుక్కలు

- ప్రకటించిన జీసీసీ

చెన్నై: రాజధాని నగరంలో సుమారు 1.80 లక్షల వీధి కుక్కలున్నాయని ప్రకటించిన గ్రేటర్‌ చెన్నై కార్పొరేషన్‌(Greater Chennai Corporation) వీటికి రూ.3 కోట్లతో రాబిస్‌ ఇంజక్షన్లను జూన్‌ నుంచి వేయనున్నట్టు తెలిపింది. జీసీసీ నిర్వహణలోని 15 జోన్లలోని 200 వార్డుల్లో పెరుగుతున్న జనాభాతో పాటు వీధికుక్కల సంఖ్య కూడా పెరుగుతోంది.వీటి బెడద నివారించే దిశగా ప్రణాళిక రూపొందించిన కార్పొరేషన్‌ సంతాన నిరోధక శస్త్రచికిత్స, రాబిస్‌ ఇంజక్షన్‌ వేయడంతో పాటు పెంపుడు జంతువులకు లైసెన్స్‌ విధానాన్ని కూడా అమలుపరుస్తుంది.

ఈ వార్తను కూడా చదవండి: Delhi High Court: బాలాజీ టెంపుల్ కూల్చివేతపై హైకోర్టు ఏం చెప్పిందంటే


వీధి కుక్కల బెడద అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాటిని వేటాడి వాహనాల ద్వారా సంరక్షణ కేంద్రాలకు తరలిస్తు న్నారు. సంతాన నిరోధక శస్త్రచికిత్స చట్టం 2023 ప్రకారం వాటిని మళ్ళీ పట్టుకున్న చోటే వదిలివేస్తున్నారు. మరీముఖ్యంగా పిచ్చికుక్క కాటుకు నగరవాసులు గురికాకుండా, రాబిస్‌ వ్యాధిని నివారించేందుకు అనుగుణం గా పుళియాన్‌తోపు, లాయిడ్స్‌ కాలనీ, కన్నమ్మపేట, షోలింగనల్లూరు, మీనబాక్కం ప్రాంతాల్లో కుక్కల సంతాన ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటయ్యాయి.


nani2.2.jpg

వీటితో పాటు 1,2,3,4,5,7,8,11,12,14, జోన్లలో ప్రతిరోజు 30 వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స, రాబిస్‌ ఇంజక్షన్‌ వేసేలా అదనంగా మరో పది కేంద్రాలు నిర్మాణం దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో, పశువుల సేవా కేంద్రం (డబ్లూవీఎస్‌) స్వచ్ఛంద సేవా సంస్థలతో కలిసి జీసీసీ నగరంలోని 200 వార్డుల్లో ఇటీవల నిర్వహించిన సర్వేలో 1,80,157 వీధి కుక్కలున్నట్లు గుర్తించారు. వీధి కుక్కల రహిత నగరంగా రాజధానిని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో జూన్‌లో రూ.3 కోట్ల తో రాబిస్‌ ఇంజక్షన్‌ వేసే పనులు ప్రారంభమవుతాయని కార్పొరేషన్‌ అధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. దిగొస్తున్న బంగారం ధరలు

కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులు హతం

High Court: ‘దోస్త్‌’పై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు

Read Latest Telangana News and National News

Updated Date - May 15 , 2025 | 01:27 PM