వైభవంగా సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతి పట్టాభిషేకం
ABN , Publish Date - Jun 08 , 2025 | 05:14 AM
తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు...

చెన్నై, జూన్ 7: తమిళనాడులోని కుర్తాళంలో ఉన్న సిద్దేశ్వరి పీఠం ఉత్తర పీఠాధిపతిగా దత్తేశ్వరానంద భారతి పట్టాభిషేకం వైభవంగా నిర్వహించారు. తెలుగు వారైన మౌనస్వామి స్థాపించిన ఈ పీఠంలో ఎందరో రుషులు, మునులు తపస్సు సాధన చేశారని పీఠం మేనేజరు మూర్తి రాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు. పీఠ పురోహితులు మాచవోలు రమేశ్ శర్మ ఆధ్వర్యంలో ఈ పట్టాభిషేకం నిర్వహించారు. దత్తేశ్వరానంద భారతి స్వామి కుర్తాళ పీఠ వైభవాన్ని ముందుకు తీసుకెళ్తారని సిద్దేశ్వరి పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి ఆకాంక్షించారు.