Rahul Gandhi: సైనికులను కించపరచే హక్కు లేదు.. రాహుల్పై కోర్టు కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:28 PM
రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత బలగాలను కించపరచేలా ఉన్నాయంటూ రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డెరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ పరువునష్టం కేసు వేశారు.

అలహాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్సభలో విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi)పై అలహాబాద్ హైకోర్టు బుధవారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) స్వేచ్ఛగా మాట్లాడే హక్కు కల్పిస్తోందని, అయితే వాక్ స్వాతంత్రానికి కూడా పరిమితులు ఉంటాయని గుర్తుచేసింది. వ్యక్తులు, సైనికులను కించపరచేలా మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. లక్నో కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ రాహుల్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టివేసింది.
రాహుల్ గాంధీ 2022లో భారత్ జోడో యాత్ర సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అరుణాచల్ ప్రదేశ్లో చైనా సైనికులు భారత సైనికులను కొట్టారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు భారత బలగాలను కించపరచేలా ఉన్నాయంటూ రిటైర్డ్ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ డెరెక్టర్ ఉదయ్ శంకర్ శ్రీవాత్సవ పరువునష్టం కేసు వేశారు. దీనిపై అడిషనల్ చీఫ్ మెజిస్ట్రేట్ అలోక్ వర్మ మార్చి 24న రాహుల్ గాంధీ కోర్టుకు హాజరుకావాలంటూ సమన్లు పంపారు. అయితే ఈ ఆదేశాలను రాహుల్ సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఫిర్యాదుదారు ఆర్మీ అధికారి కాదని, ఆయనను తాను వ్యక్తిగతంగా కించపరచ లేదని రాహుల్ గాంధీ చేసిన వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్కు ఆర్మీ పట్ల ఎంతో గౌరవం ఉందని, ఆర్మీపై చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతంగా ఆయనను గాయపరచినందున పిటిషన్ వేయడానికి ఆయన అర్హుడేనని స్పష్టం చేస్తూ.. రాహుల్ పిటిషన్ను తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి..
జూలై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
ఓవైపు వివాదం.. మరోవైపు సర్కార్ అండ.. కమల్కు గుడ్న్యూస్
For National News And Telugu News