Share News

India Pak Ceasefire: కాల్పుల విరమణకే షరతు.. సింధు జలాలపై భారత్ నిర్ణయానికి వర్తించదు

ABN , Publish Date - May 10 , 2025 | 08:54 PM

కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి, వాటికి కూడా తాజా షరతు వర్తిస్తుందా.. దీనిపై అధికారిక వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి.

India Pak Ceasefire: కాల్పుల విరమణకే షరతు.. సింధు జలాలపై భారత్ నిర్ణయానికి వర్తించదు

న్యూఢిల్లీ: కాల్పుల విరమణకు భారత్-పాక్ అంగీకరించిన నేపథ్యంలో పాక్‌పై భారత్ ఇటీవల తీసుకున్న పలు కఠిన నిర్ణయాల పరిస్థితి ఏమిటి? వాటికి కూడా తాజా షరతు వర్తిస్తుందా? దీనిపై అధికారిక వర్గాలు తాజాగా వివరణ ఇచ్చాయి. కాల్పుల విరమణ ఒక్కటే షరతులకు లోబడి కుదుర్చుకున్న అంగీకారమని, సింధు జాలల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ ఇటీవల తీసుకున్న నిర్ణయం సహా దౌత్యపరమైన చర్యలు యథాప్రకారం కొనసాగుతాయని ఆ వర్గాలు తెలిపాయి. కాల్పుల విరమణకు తొలుత భారత్‌కు అభ్యర్థన చేసినది కూడా దాయాది దేశమేనని ఆ వర్గాలు వివరించాయి.

Omar Abdullah: భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ.. స్వాగతించిన జమ్మూకశ్మీర్ సీఎం


breif.jpg

ఇదే విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సైతం మీడియా సమావేశంలో తెలిపారు. మధ్యాహ్నం 3.35 గంటలకు పాకిస్థాన్ మిలటరీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ మన డీజీఎంఓకు ఫోన్ చేశారని, ఆ తర్వాత కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందని చెప్పారు. భూమి, గగనతలం, సముద్రమార్గంలో మిలటరీ చర్చలను నిలిపివేసేందుకు అంగీకారం కుదరిందన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చినట్టు చెప్పారు.


మిలటరీ యాక్షన్ సీజ్ చేసినప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత వైఖరిలో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైసంకర్ మీడియాకు ఇచ్చిన బ్రీఫింగ్‌లో స్పష్టం చేశారు. కాల్పులు, మిలటరీ యాక్షన్‌పైనే ఇరుదేశాలు అవగాహనకు వచ్చాయన్నారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్నా తిప్పికొట్టాలన్న భారత విధాన నిర్ణయం కొనసాగుతుందని చెప్పారు.


సింధూ జలాల ఒప్పందం

పహల్గాంలో 26 మంది టూరిస్టులను ఉగ్రవాదులు అమానుషంగా కాల్చిచంపడం, ఈ ఘటనలో పాక్ ప్రమేయం ఉన్నట్టు తేలడంతో దాయాది దేశంపై భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా పాక్‌తో 60 ఏళ్ల క్రితం నాటి సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసినట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం అప్రకటిత 'యుద్ధం'తో సమానమని, దీనిని ప్రతిఘటించి తీరుతామని పాక్ నేతలు బహిరగం ప్రకటనలు చేశారు. భారత్ అంతే దీటుగా సమాధానం ఇచ్చింది. సొంతింటి అవసరాలు తమకు చాలా కీలకమని, మారిన పరిస్థితుల రీత్యా ఇప్పటి వరకూ బయటకు వదలిన నీటిని దేశ అవసరాలకు వాడుకోదలచామని స్పష్టం చేసింది.


ఇవి కూడా చదవండి..

Operation Sindhoor: ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగా పరిగణిస్తాం: పాక్‌స్థాన్‌కు భారత్ సీరియస్ వార్నింగ్

India-Pakistan Ceasefire: కాదు కాదంటూనే సయోధ్య కుదిర్చిన పెద్దన్న

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 09:03 PM