Share News

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ.. పెద్దయి తల్లినే చంపిన బాలిక

ABN , Publish Date - May 17 , 2025 | 12:50 PM

Class 8 Student: పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.

Class 8 Student: రోడ్డుపక్కన పడున్న పసికందును పెంచుకున్న మహిళ..  పెద్దయి తల్లినే చంపిన  బాలిక
Class 8 Student

కలికాలం అంటే ఇదే కాబోలు.. ఓ మహిళ ఎంతో ఉన్నతంగా ఆలోచించి రోడ్డు పక్కన దొరికిన ఓ పాపను దత్తత తీసుకుంది. కన్న కూతురిలా ఎలాంటి లోటు రానీకుండా పెంచుతోంది. అలాంటి తల్లికి అండగా నిలవాల్సిందిపోయి .. ఓ బాలిక దారుణానికి పాల్పడింది. తన మగ స్నేహితులతో కలిసి పెంపుడు తల్లిని చంపేసింది. ఈ దారుణ సంఘటన ఒడిస్సాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఒడిస్సాలోని భుబనేశ్వర్‌కు చెందిన జితేంద్ర కుమార్ పండ, రాజ్య లక్ష్మి భార్యా భర్తలు. దాదాపు 14 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన ఓ పాప దొరికింది.


పిల్లలు లేని వారు ఆ పాపను దత్తత తీసుకుని పెంచుకుంటూ ఉన్నారు. పాపను దత్తత తీసుకున్న సంవత్సరం తర్వాత జితేంద్ర చనిపోయాడు. ఇక, అప్పటినుంచి రాజ్యలక్ష్మి అన్నీ తానై పాపను పెంచుతూ ఉంది. పాప చదువులకోసం కొన్నేళ్ల క్రితం భుబనేశ్వర్ నుంచి పర్లాకిమిడికి వచ్చి చేరింది. పెంపుడు తల్లి తన కోసం కష్టపడుతోందన్న ఇంగితం లేకుండా ఆ బాలిక ప్రవర్తించింది. బాలిక వయసు ప్రస్తుతం దాదాపు 13 సంవత్సరాలు. 8వ తరగతి చదువుతోంది. బాలిక ఎక్కువగా ఫోన్ వాడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే రథ్, సాహులతో సంబంధం పెట్టుకుంది.


వారు ఆ బాలిక కంటే వయసులో చాలా పెద్ద వారు. ఈ మొత్తం క్రైమ్ కథలో రథ్ కీలక పాత్ర పోషించాడు. అతడే రాజ్యలక్ష్మి మర్డర్ జరగటానికి కారణం అయ్యాడు. రాజ్యలక్ష్మి చనిపోతే.. తాము ఎలాంటి గొడవ లేకుండా రిలేషన్ కొనసాగించవచ్చని.. ఆస్తులను కూడా అనుభవించవచ్చని చెప్పాడు. పెంపుడు తల్లిని చంపే విధంగా బ్రెయిన్ వాష్ చేశాడు. బాలిక పెంపుడు తల్లిని చంపడానికి ఒప్పుకుంది. ఆ బాలిక, రథ్, సాహులు కలిసి మర్డర్ ప్లాన్ వేశారు. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 29న రాజ్యలక్ష్మికి బాలిక నిద్రమాత్రలు ఇచ్చింది.


ఆమె స్ప్రహ తప్పిపడిపోగానే.. రథ్, సాహులకు ఫోన్ చేసి పిలిపించింది. ముగ్గురు కలిసి దిండుతో రాజ్యలక్ష్మికి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ఆ తర్వాత బాలిక ఇతర కుటుంబసభ్యులను పిలిచింది. తల్లి ఎంత పిలిచినా లేవటం లేదని చెప్పింది. వారు వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే రాజ్యలక్ష్మి చనిపోయినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. గుండె పోటు కారణంగా ఆమె చనిపోయిందని అందరూ భావించారు. అయితే, రాజ్యలక్ష్మి సోదరుడు సిబ ప్రసాద్ బాలిక ఫోన్ చెక్ చేయటంతో అసలు విషయం బయటపడింది. అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వారు చేసిన నేరం ఒప్పుకున్నారు. చేసిన దారుణానికి శిక్షగా ముగ్గురు జైలులో పడి మగ్గుతున్నారు.


ఇవి కూడా చదవండి

Pak PM Shehbaz Sharif: భారత్ దాడి చేసిందని ఆర్మీ చీఫ్ ఫోన్ చేశాడు.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని..

Village Well: మృత్యు బావి.. 8 మందిని బలి తీసుకుందన్న భయంతో..

Updated Date - May 17 , 2025 | 12:55 PM