China IOMed: ఆధిపత్యం కోసం చైనా ఎత్తుగడ.. ఇండియాను ఒంటరిని చేసి..
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:22 AM
China IOMed: దక్షిణ ఆసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది. నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్లింది.

చైనా తన దుష్ట బుద్ధి మార్చుకోవటం లేదు. అనవసరంగా భారతదేశాన్ని ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తన మిత్ర దేశం పాకిస్తాన్తో కలిసి కొత్త కొత్త కుట్రలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనా ఓ కొత్త సంస్థకు రూపకల్పన చేసింది. ఇంటర్ నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్(IOMed)ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా దక్షిణ ఆసియా దేశాలపై ఆధిపత్యం సాధించడానికి చూస్తోంది. ఇప్పటికే పాకిస్తాన్ దేశంపై చైనా పూర్తి స్థాయిలో పట్టు సాధించింది. ఇప్పుడు మిగిలిన దేశాలపై పట్టు సాధించడానికి చూస్తోంది.
ఈ మేరకు ఎంతో చాకచక్యంగా పావులు కదుపుతోంది. ఓ వైపు దక్షిణ ఆసియాలో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే.. మరో వైపు ఇండియాను ఒంటరిని చేసే ప్రయత్నం మొదలెట్టింది. అందుకే గత మే 30వ తేదీన ఇంటర్ నేషనల్ మీడియేషన్ ఆర్గనైజేషన్ను ఏర్పాటు చేసింది. దక్షిణ ఆసియాలోని దేశాలను ఇందులో భాగం కమ్మని కోరుతోంది. ఇప్పటికే పాకిస్తాన్ ఈ సంస్థలో చేరిపోయింది. నేపాల్ దేశానికి కూడా ఆహ్వానం వెళ్లింది. IOMed ప్రారంభ కార్యక్రమానికి నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రానా దూబా వెళ్లారు.
అయితే, ఆ సంస్థలో చేరడానికి నేపాల్ అంతగా ఆసక్తి చూపటం లేదు. ఒక వేళ IOMedలో దక్షిణ ఆసియాలోని దేశాలు చేరితే.. అది భారత్కు నష్టమే అని చెప్పాలి. దక్షిణ ఆసియాలో చైనా స్థానం మరింత బలపడుతుంది. అందుకే భారత్ ఈ సవాలును ఎదుర్కోవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చైనా పన్నాగాలకు చెక్ పెట్టేలా కొత్త ఆలోచనలు చేయకతప్పదు.
ఇవి కూడా చదవండి
తీవ్ర విషాదం.. బస్సులో ప్రయాణిస్తూ చనిపోయిన డైరెక్టర్..
నిలబడి నీళ్లు తాగితే కిడ్నీలపై ప్రభావం పడుతుందా..