Share News

రూ.3 వేలు దాటే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలు?

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:02 AM

యూపీఐ లావాదేవీలపై మళ్లీ మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) చార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 వేలకు పైబడి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ చార్జీలు వర్తిస్తాయి.

రూ.3 వేలు దాటే యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలు?

  • రెండు నెలల్లో అమలు!

  • ఖండించిన కేంద్రం

న్యూఢిల్లీ, జూన్‌ 11: యూపీఐ లావాదేవీలపై మళ్లీ మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌(ఎండీఆర్‌) చార్జీలను విధించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రూ.3 వేలకు పైబడి చేసే యూపీఐ చెల్లింపులకు ఈ చార్జీలు వర్తిస్తాయి. ఒకట్రెండు నెలల్లో ఈ విధానం అమల్లోకి వస్తుందంటూ ‘ఎన్‌డీటీవీ ప్రాఫిట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలను ఉటంకించింది. ఆ కథనం ప్రకారం.. యూపీఐ విధానం అమల్లోకి వచ్చిన తొలినాళ్లలో ఎండీఆర్‌ చార్జీలు 0.3శాతంగా ఉండేవి.


అంటే.. క్రెడిట్‌ కార్డుల(0.9% నుంచి 2%) మాదిరిగానే వర్తకులపై ఎండీఆర్‌ భారం పడేది. 2020 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం వర్తకులకు సాంత్వన కల్పిస్తూ.. జీరో ఎండీఆర్‌ విధానాన్ని అమలు చేసింది. ఇప్పుడు 80శాతానికి పైగా డిజిటల్‌ చెల్లింపులు యూపీఐ ద్వారా జరుగుతుండడంతో.. బ్యాంకులు, చెల్లింపు సేవాసంస్థల నిర్వహణ చార్జీలను దృష్టిలో పెట్టుకుని, ఎండీఆర్‌కు సిద్ధమైంది. అయితే.. ఎండీఆర్‌ పెంపు వార్త అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Jun 12 , 2025 | 05:02 AM