BSF Jawaan: బీఎస్ఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ను భారత్కు అప్పగించిన పాకిస్థాన్
ABN , Publish Date - May 15 , 2025 | 05:46 AM
పాకిస్థాన్ రేంజర్ల అదుపులో ఉన్న మన బీఎ్సఎఫ్ జవాన్ విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 21 రోజుల తర్వాత బీఎ్సఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను బుధవారం భారత్కు పాకిస్థాన్ అప్పగించింది.

అమృత్సర్, మే 14: పాకిస్థాన్ రేంజర్ల అదుపులో ఉన్న మన బీఎ్సఎఫ్ జవాన్ విడుదల విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. 21 రోజుల తర్వాత బీఎ్సఎఫ్ జవాన్ పూర్ణం కుమార్ షాను బుధవారం భారత్కు పాకిస్థాన్ అప్పగించింది. ఉదయం 10.30 గంటలకు మన జవాన్ను అట్టారి-వాఘా సరిహద్దు వద్ద పాకిస్థాన్ రేంజర్లు బీఎ్సఎ్ఫకు అప్పగించినట్టు బీఎ్సఎఫ్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. పాకిస్థాన్ రేంజర్లతో బీఎ్సఎఫ్ నిరంతరం నిర్వహించిన ఫ్లాగ్ సమావేశాలు, ఇతర కమ్యూనికేషన్ మార్గాల ద్వారా బీఎ్సఎఫ్ కానిస్టేబుల్ను వెనక్కి తీసుకురావడం సాధ్యపడినట్టు చెప్పారు.
ఇన్ని రోజులు బీఎ్సఎఫ్ జవాన్.. పాక్ రేంజర్ల అదుపులో ఉన్న నేపథ్యంలో ఈయనకు పూర్తిస్థాయిలో బాడీ చెక్పతోపాటు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. 24వ బీఎ్సఎఫ్ బెటాలియన్కు చెందిన షాను పంజాబ్లో భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ రేంజర్లు ఏప్రిల్ 23న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఫెరోజ్పూర్ సెక్టార్ ప్రాంతంలో విధుల్లో ఉన్న షా అనుకోకుండా సరిహద్దు దాటడంతో పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. బీఎ్సఎఫ్ జవాన్ను బుధవారం పాకిస్థాన్ అప్పగించిన వెంటనే దాదాపు రెండు వారాలుగా కస్టడీలో ఉన్న పాకిస్థాన్ రేంజర్ను భారత్ విడుదల చేసింది.