Share News

General Upendra Dwivedi: మన బలగాల ధైర్యసాహసాలు భేష్‌: ఆర్మీ చీఫ్‌

ABN , Publish Date - May 16 , 2025 | 05:33 AM

జమ్మూ కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది గురువారం సందర్శించారు.

General Upendra Dwivedi: మన బలగాల ధైర్యసాహసాలు భేష్‌: ఆర్మీ చీఫ్‌

శ్రీనగర్‌/జమ్మూ మే 15: జమ్మూ కశ్మీర్‌ బారాముల్లా జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలను ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది గురువారం సందర్శించారు. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో ఎల్‌వోసీ వెంబడి అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన బలగాలను ప్రశంసించారు. శత్రువుల నుంచి ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు.


చినార్‌ కార్ప్స్‌కు చెందిన డాగర్‌ విభాగాన్ని ఆర్మీ స్టాఫ్‌ చీఫ్‌ (సీవోఏఎస్‌) సందర్శించారని ‘ఎక్స్‌’లో చేసిన పోస్టులో సైన్యం తెలిపింది. కాగా, ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నందుకు సాయుధ దళాలను చూసి దేశం గర్విస్తోందని జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా పేర్కొన్నారు.

Updated Date - May 16 , 2025 | 05:33 AM