Air India Flight: ఎయిర్ ఇండియా హాంగ్కాంగ్-ఢిల్లీ విమానంలో సాంకేతిక లోపం
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:13 PM
విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో సేఫ్టీ ప్రోటాకాల్కు అనుగుణంగా విమానాన్ని హాంగ్కాంగ్కు పైలట్ తిరిగి మళ్లించారు.

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియాకు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హాంక్కాంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లయిట్ AI315 బోయింగ్ 787-8 డ్రీమ్లైనర్లో సోమవారం ఉదయం సాంకేతిక లోపం తలెత్తింది. విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో సేఫ్టీ ప్రోటాకాల్కు అనుగుణంగా విమానాన్ని హాంగ్కాంగ్కు పైలట్ తిరిగి మళ్లించారు. హాంగ్కాంగ్ ఎయిర్పోర్ట్లో విమానం దిగగానే ప్రయాణికులందరూ కిందకు దిగిపోయినట్టు అధికారులు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపంపై ప్రస్తుతం సమగ్ర తనిఖీలు జరుపుతున్నారు.
అహ్మదాబాద్లో ఈనెల 12న ఎయిర్ ఇండియా 171 డ్రీమ్లైనర్ దుర్ఘటనలో విమానంలోని 241 మందితో సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద స్థలి నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డును ఆదివారంనాడు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్ బాక్స్ లోని సమాచారంతో ఈ ప్రమాదానికి కారణాలను కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
జిప్లైన్ తెగడంతో 30 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ బాలిక.. షాకింగ్ వీడియో వైరల్
27 ఏళ్ల క్రితం ఎయిర్ ఇండియా తరహా ప్రమాదం.. ప్రాణాలు దక్కించుకున్న 11ఏ సీటు ప్యాసెంజర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి