Ahmadabad: మంటల్లోనూ చెక్కు చెదరని ‘భగవద్గీత‘
ABN , Publish Date - Jun 14 , 2025 | 04:56 AM
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు.

అహ్మదాబాద్, జూన్ 13: అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో ప్రయాణికులు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయారు. విమానంలోని 1.25 లక్షల లీటర్ల ఇంధనం కారణంగా మంటలు వ్యాపించి అందులోని భాగాలే కరిగిపోయాయి. ఆశ్చర్యకరంగా ఆ విమాన శకలాల్లో చెక్కుచెదరని రీతిలో ఉన్న పవిత్ర గ్రంథం భగవద్గీత సహాయ సిబ్బందికి లభించింది. అట్ట మీద కొన్ని గీతలు పడడం తప్పిస్తే పుస్తకం అంతా భద్రంగానే ఉంది.
ఇస్కాన్ వ్యవస్థాపకుడు స్వామి ప్రభుపాద చిత్రం సహా ఏ ఫొటో కూడా దెబ్బతినలేదు. ఒక్కచోట ఓ పేజీ మాసినట్టు కనిపించినా గ్రంథం మొత్తం బాగానే ఉంది. బహుశా ఆ సమయంలో ఏ ప్రయాణికుడైనా ఆ గ్రంథాన్ని చదువుతూ ఉండవచ్చని భావిస్తున్నారు. మంటలు వ్యాపించినా ఆ పవిత్ర గ్రంథం ఏ మాత్రం దెబ్బతినకుండా కనిపించిందని సహాయ చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు.