Operation Sindoor: పఠాన్ ఔట్.. అభిషేక్ ఇన్
ABN , Publish Date - May 20 , 2025 | 02:37 PM
ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ కోసం ఒక పేరును సూచించాలని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరడంతో అభిషేక్ను పార్టీ తరఫున సీఎం నామినేట్ చేశారు.

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వివరాలతో పాటు ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం సంహించేది లేదన్న భారత దృఢ వైఖరిని ప్రపంచ దేశాలకు వివరించేందుకు విదేశాలకు వెళ్తున్న పార్లమెంటు ప్రతినిధుల బృందంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) తరఫున ఆ పార్టీ ఎంపీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ (Abhisekh Banerjee) వచ్చి చేరారు. ఆపరేషన్ సింధూర్ డెలిగేషన్ కోసం ఒక పేరును సూచించాలని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు కోరడంతో అభిషేక్ను పార్టీ తరఫున సీఎం నామినేట్ చేశారు.
Minister Vijay Shah - SIT: మహిళా సైనికాధికారిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. మధ్యప్రదేశ్ మంత్రిపై సిట్ ఏర్పాటు
టీఎంసీ ఒక ట్వీట్లో ఈ విషయాన్ని తెలియజేసింది. అభిషేక్ బెనర్జీ నామినేషన్తో ఉగ్రవాదాన్ని ఎంతమాత్రం పశ్చింబెంగాల్ సహించదన్న బలమైన సందేశాన్ని ఇచ్చిందని, పార్టీ చైర్పర్సన్ మమతా బెనర్జీ అధికారికంగా అఖిల పక్ష బృందానికి అభిషేక్ బెనర్జీని నామినేట్ చేసిందని టీఎంసీ పేర్కొంది.
తప్పుకున్న యూసుఫ్ పఠాన్
దీనికి మందు, విదేశాలకు వెళ్లే ఏడు దౌత్య బృందాల్లో ఒక టీమ్కు సభ్యుడిగా తృణమూల్ ఎంపీ, భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ పేరును చేర్చింది. ఇందుకు టీఎంసీ ఘాటుగా స్పందించింది. ఆల్ పార్టీ డెలిగేషన్కు టీఎంసీ ఎవరిని నామినేట్ చేయాలో కేంద్రం ఎలా నిర్ణయిస్తుందని అటు మమతా బెనర్జీ, ఇటుఅభిషేక్ బెనర్జీ నిలదీశారు. దీంతో పఠాన్ పార్లమెంటరీ టీమ్ నుంచి వైదొలిగారు.
ఇవి కూడా చదవండి..
Shashi Tharoor: ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతూ ఎంపీ శశి థరూర్ లేఖ
Jyoti Malhotra Case: జ్యోతి మల్హోత్రా కేసులో కీలక అప్డేట్..యాంటీ టెర్రర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి