Share News

సిందూర్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌

ABN , Publish Date - Jun 15 , 2025 | 06:20 AM

ఆపరేషన్‌ సిందూర్‌ను వ్యతిరేకిస్తూ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా దుష్ప్రచారం చేసిన 30 మందిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

సిందూర్‌కు వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌

  • ఎన్‌ఐఏ అదుపులో 30 మంది

చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ సిందూర్‌ను వ్యతిరేకిస్తూ వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా దుష్ప్రచారం చేసిన 30 మందిని ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. పాకిస్థాన్‌కు మద్దతు ప్రచారం సాగిస్తూ, ఆపరేషన్‌ సింధూర్‌ దాడులను తీవ్రంగా ఖండిస్తూ వేల సంఖ్యలో ఇతర గ్రూపులకు సందేశాలు పంపినట్టు ఎన్‌ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. దీంతో రెండువారాలుగా ఎన్‌ఐఏ అధికారులు చెన్నై అంతటా నిఘా వేసి వాట్సాప్‌ గ్రూపు ద్వారా ఎవరెవరికి సందేశాలు వెళ్లాయన్నదానిపై ఆరా తీశారు. వాటి ఆధారంగా 30 మందిని అదుపులోకి తీసుకున్నారు.

Updated Date - Jun 15 , 2025 | 06:20 AM