Share News

Beauty Tips: ముల్తానీ మట్టి VS శనగ పిండి.. ముఖానికి ఏది మంచిది..

ABN , Publish Date - Jun 05 , 2025 | 10:07 AM

సహజ సౌందర్య కోసం చాలా మంది ముల్తానీ మట్టి లేదా శనగపిండి వాడతారు. అయితే, ఈ రెండింటిలో ముఖానికి ఏది మంచిది? దేనిని వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Beauty Tips: ముల్తానీ మట్టి VS శనగ పిండి.. ముఖానికి ఏది మంచిది..
Multan Matti

మనలో చాలా మంది అందంగా కనిపించడానికి మార్కెట్లో లభించే అనేక రకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తారు. మరి కొందరు సహజ సబ్బులు, షాంపూలు, నూనెలు వంటి సహజ సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఎందుకంటే అవి చర్మం, జుట్టుకు మంచిగా ఉంటాయి. ఎలాంటి రసాయనలు లేకుండా ఉంటాయి. సహజ సౌందర్య ఉత్పత్తులలో చాలా మంది ముల్తానీ మట్టి, శనగ పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు.

ముల్తానీ మట్టి, శనగ పిండిని ఎక్కువగా ఫేస్ మాస్క్‌, స్క్రబ్‌లుగా ఉపయోగిస్తారు. ముల్తానీ మట్టి చర్మాన్ని శుభ్రంగా, మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. శనగ పిండి చర్మాన్ని పోషిస్తుంది. మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు ప్రభావవంతంగా ఉంటుంది. అయితే, ఈ రెండింటిలో ముఖానికి ఏది మంచిది? దేనిని వాడటం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


ముల్తానీ మట్టి ఉపయోగాలు

ముల్తానీ మట్టికి ఆయుర్వేదంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ముల్తానీ మట్టి చర్మాన్ని మృదువుగా చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని చెబుతారు. దీనితో పాటు, ఇది మచ్చలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది.

ముల్తానీ మట్టి చర్మాన్ని శుభ్రపరచడానికి, చర్మంలో నూనెను నియంత్రించడానికి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ముల్తానీ మట్టి చర్మాన్ని లోతుగా శుభ్రపరచడంలో, మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది. జిడ్డుగల చర్మం, ముఖంపై పిగ్మెంటేషన్ ఉన్నవారు ముల్తానీ మట్టితో దీనిని నియంత్రించవచ్చు.

శనగ పిండి ప్రయోజనాలు

శనగ పిండి చర్మానికి చాలా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇది చర్మంలోని మృతకణాలను తొలగించి చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ముల్తానీ మట్టి కంటే శనగ పిండి చర్మానికి సహజంగా మరింత మెరుపును ఇస్తుందని నిపుణులు అంటున్నారు. జిడ్డుగల చర్మం ఉన్నవారు శనగ పిండిని వాడాలని అంటున్నారు. దీని కోసం, నాలుగు చెంచాల శనగ పిండికి ఒక చెంచా రోజ్ వాటర్, రెండు చెంచాల తేనె కలిపి, బాగా కలిపి ముఖం, మెడపై అప్లై చేయండి. అది ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

రెండింటిలో ఏది మంచిది?

ముల్తానీ మట్టి, శనగ పిండి రెండూ చర్మాన్ని మెరుగుపరుస్తాయని భావిస్తారు. కానీ నిపుణులు చర్మ రకాన్ని బట్టి వాటిని ఎంచుకోవాలని సిఫార్సు చేస్తారు. పొడి చర్మాన్ని తేమ చేయడానికి శనగ పిండిని ఉపయోగించాలని, జిడ్డుగల చర్మం ఉన్నవారు మొటిమలను నివారించడానికి ముల్తానీ మట్టిని పూయడం మంచిదని సూచిస్తున్నారు.


Also Read:

హోటల్‌లో రూమ్ తీసుకోవడమే కాదు.. ఇవి కూడా గమనించండి..

డయాబెటిస్ కంట్రోల్‌కి కాకరకాయ రసం.. ఎప్పుడు తాగాలో తెలుసా..

For More Lifestyle News

Updated Date - Jun 05 , 2025 | 10:10 AM