Share News

Trump Xi Trade Talks: ట్రంప్, జీ మధ్య త్వరలో వాణిజ్య చర్చలు.. వైట్ హౌస్ ప్రకటన

ABN , Publish Date - Jun 03 , 2025 | 08:59 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలో చైనా అధినేత జీ జింగ్‌పింగ్‌తో మాట్లాడతారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో తెలిపింది. వాణిజ్య అంశాలపై ఇరు దేశాధినేతలు ఫోన్ కాల్‌లో చర్చిస్తారని వెల్లడించింది.

Trump Xi Trade Talks: ట్రంప్, జీ మధ్య త్వరలో వాణిజ్య చర్చలు.. వైట్ హౌస్ ప్రకటన

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జింగ్‌పింగ్ త్వరలో ఫోన్ ద్వారా వాణిజ్య చర్చలు జరుపుతారని శ్వేతసౌధం సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వారమే ఇరు దేశాధినేతలు ఫోన్ కాల్‌ చర్చలు చేపట్టొచ్చని తెలిపింది. వాణిజ్యం సులభతరం చేసేందుకు జీ కట్టుబడి లేరంటూ ట్రంప్ ఆరోపించిన కొన్ని రోజులకే వైట్‌హాస్ ఈ ప్రకటన చేయడం గమనార్హం.

ఈ వారంలోనే ఇరు దేశాధినేతలు ఫోన్‌ కాల్ ద్వారా చర్చలు జరుపుతారని శ్వేతసౌధం ప్రెస్ సెక్రెటరీ కెరొలీన్ లెవిట్ పేర్కొన్నారు. ఫోన్ చర్చల గురించి ట్రంప్ ప్రభుత్వ ఉన్నతాధికారులు ప్రస్తావించడం ఇది మూడోసారి. జెనీవాలో గత నెలలో కుదిరిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర వాణిజ్య సమస్యలు కూడా ఈ ఫోన్ కాల్‌లో చర్చకు రానున్నాయి.


అంతకుముందు యూఎస్ ట్రెజరీ సెక్రెటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ట్రంప్, జీ ఫోన్ చర్చల గురించి ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. క్రిటికల్ మినరల్స్‌ ఎగుమతులపై చైనా ఆంక్షల గురించి చర్చలు జరుగుతాయని అన్నారు. జీతో చర్చలు జరుగుతాయని ట్రంప్ కూడా గత శుక్రవారం వెల్లడించారు.

గతవారం జెనీవాలో చైనాతో జరిగిన వాణిజ్య చర్చల్లో అమెరికా బృందానికి స్కాట్ బెసెంట్ నేతృత్వం వహించారు. అయితే, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ చర్చలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అప్పటి చర్చల్లో కొంత పురోగతి కనిపించినా ఆ తరువాత మాత్రం పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారిపోయింది. అయితే, ఇరు దేశాల మధ్య కుదిరిని తాత్కాలిక ఒప్పందం ప్రకారం, టారిఫ్‌లకు 90 రోజుల పాటు విరామం ప్రకటించారు. దీంతో, ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్‌కు కొత్త ఊపు వచ్చింది.


ఇరు దేశాల మధ్య వివాదానికి కారణమవుతున్న అంశాలపై మాత్రం పురోగతి కనిపించలేదు. దేశ ఆర్థిక వ్యవస్థ చైనా చెప్పుచేతల్లో ఉండటం, ఎగుమతులను ప్రోత్సహించేలా చైనా ప్రభుత్వ చర్యలపై ట్రంప్ ఎప్పటి నుంచో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రంప్ సుంకాల విధింపును అమెరికా వాణజ్య కోర్టు నిలుపుదల చేసినా అప్పీల్స్ కోర్టు‌లో మాత్రం ఊరట దక్కింది.

ఇవీ చదవండి:

నిప్పుతో చెలగాటం వద్దు.. అమెరికాపై మండిపడ్డ చైనా

వాస్తవాన్ని వివరించిన భారత్.. పాక్‌కు మద్దతు ఉపసంహరించిన కొలంబియా

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 03 , 2025 | 10:21 AM