Share News

Taliban Leader Warns Pashtuns: భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్

ABN , Publish Date - May 08 , 2025 | 07:24 PM

పాక్ ఆర్మీ రాజకీయ క్రీడలో పావులు కావొద్దంటూ అక్కడి పాష్‌తూన్ తెగలకు అప్ఘానిస్థాన్ సీనియర్ నేత ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Taliban Leader Warns Pashtuns: భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్
Taliban Pashtun warning

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దాయాది దేశంలోని పాష్‌తూన్ తెగ వారికి తాలిబాన్ సీనియర్ నేత, మాజీ రాయబారి ముల్లా అబ్దుల్ సలామ్ జయీఫ్ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఉద్రిక్తతల్లో జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేశారు.

పాక్ ఆర్మీ ఆడే ఆటలో పావుగా మారొద్దని పాష్‌తూన్ తెగలకు ఎక్స్ వేదికగా ఆయన హెచ్చరించారు. జీహాద్ పేరిట పాక్ ఆర్మీ షాష్‌తూన్‌లను భారత్‌పైకి ఉసిగొల్పే ప్రయత్నం చేయొచ్చని అన్నారు. భారత్, పాక్ మధ్య జరుగుతున్న ఈ రాజకీయ రగడలో ఇరుక్కోవద్దని చెప్పారు. పాక్ పొలిటికల్ గేమ్‌కు తమ పిల్లలను దూరంగా ఉంచాలని వారికి విజ్ఞప్తి చేశారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.


తాలిబాన్లతో పాక్ విభేదాలు

తాలిబాన్లలో అధిక శాతం పాష్‌తూన్ తెగకు చెందిన వారే. పాక్‌లోని ఖైబర్‌పాఖ్‌తూన్‌ఖ్వా, బలొచిస్థాన్‌లో వీరి ప్రాబల్యం అధికం. 1948, 1999 నాటి భారత్ పాక్ యుద్ధాల్లో పాష్‌తూన్ తెగలు కూడా పాల్గొన్నాయి. పాక్‌కు పాష్‌తూన్‌లు మిత్రులన్న భావన ఉన్నప్పటికీ ఇటీవల కాలంలో తాలిబన్, పాక్ నేతల మధ్య ఎడం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జయీఫ్ స్టేట్‌మెంట్ కీలకంగా మారింది. భారత్‌కు వ్యతిరేకంగా పాక్ తమను రంగంలోకి దిగొచ్చని పాష్‌తూన్‌ తెగల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.


అప్ఘానిస్థాన్‌లో తమ పరిపాలనను సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న తాలిబాన్‌లు.. భారత్, పాక్ వివాదంలో జోక్యం చేసుకోవద్దనే అభిప్రాయంలో ఉన్నట్టు పరిశీలకులు చెబుతున్నారు. దక్షిణాసియా ప్రాంతంలో అస్థిరతకు తాము కారణం కావొద్దని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్ఘానిస్థాన్‌ పాలకులుగా తమ విశ్వసనీయతను పరిరక్షించుకునేందుకు నిశ్చయించుకున్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే భారత్, పాక్ ఉద్రిక్తతలు అప్ఘాన్ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వాఘా సరిహద్దు మూసేయడంతో అప్ఘానిస్థాన్‌కు చెందిన అనేక కంటెయినర్‌లు అక్కడే నిలిచిపోయాయి.

ఇవి కూడా చదవండి:

భారత్-పాక్ ఉద్రిక్తతల వెనక చైనా కుట్ర ఉంది.. అమెరికా వ్యాపారవేత్త కామెంట్ వైరల్

ఇండియా డ్రోన్ అటాక్స్.. లబోదిబోమంటూ పాక్ ప్రెస్ మీట్

ఆపరేషన్ సిందూర్‌పై స్పందించిన పహల్గాం మృతుడి భార్య

భారత్, పాకిస్తాన్ బలాబలాలు.. యుద్ధం వస్తే ఎవరు కింగ్..

Read Latest and National News

Updated Date - May 08 , 2025 | 07:32 PM