Share News

MJ Akbar: పాక్‌స్థాన్‌ను రెండు తలల విషనాగుతో పోల్చిన ఎంజే అక్బర్

ABN , Publish Date - May 31 , 2025 | 04:20 PM

ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందని ఎంజే అక్బర్ అన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.

MJ Akbar: పాక్‌స్థాన్‌ను రెండు తలల విషనాగుతో పోల్చిన ఎంజే అక్బర్

డెన్మార్క్: పహల్గాం ఉగ్రదాడి అత్యంత పాశవికమని, యూరప్ చవిచూసిన కమ్యూనల్ టెర్రరిజం తరహా అనాగరిక చర్యని కేంద్ర మాజీ మంత్రి, అఖిల పక్ష ప్రతినిధి బృందం సభ్యుడు ఎంజే అక్బర్ (MJ Akbar) అన్నారు. డెన్మార్క్ దేశం కోపెన్ హాగన్‌లో పర్యటిస్తున్న ఎంజే అక్బర్.. పాకిస్థాన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ దేశాన్ని విషపు నాగుతో పోల్చారు. పాక్ ప్రభుత్వానికి పాము వలే చీలిక నాలుక (Forked tongue), రెండు తలలు (Doble faced) ఉన్నాయని ఆగ్రహించారు. కోపెన్ హాగన్‌లో ఎన్ఐఆర్‌లతో అఖిలపక్ష ఎంపీల ప్రతినిధి బృందం సమావేశమైంది. ఈ ప్రతినిధి బృందానికి బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సారథ్యం వహిస్తున్నారు. కాగా, ఈ సమావేశంలో ఎంజే అక్బర్ మాట్లాడారు.


ఎవరితో మాట్లాడాలి?

ఈ సందర్భంగా ఎంజే అక్బర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 26న పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది ప్రజలను కాల్చి చంపారని, ఇందుకు ప్రతిగా ఇస్లామాబాద్‌పై ఇండియా కఠిన చర్యలు తీసుకుందన్నారు. దీంతో న్యూఢిల్లీతో ఇస్లామాబాద్ చర్చల ప్రస్తావన చేస్తోందన్నారు. 'పాకిస్థాన్‌లో రెండు ముఖాల ప్రభుత్వం ఉంది. ఏ ముఖంతో మేము మాట్లాడాలి? అక్కడున్నది చీలిక నాలుక ఉన్న ప్రభుత్వం. ఏ నాలుకతో చర్చించాలి? విషపు నాలుకతో వాళ్లు మాట్లాడతారు. పాము ఎప్పుడూ తన విషం వల్ల తాను చనిపోదు. ఇతరులకే నష్టం' అని పాక్‌పై ఆయన నిప్పులు చెరిగారు. చర్చల పేరుతో కాలాన్ని తాము వృథా చేయమని, సమస్యలను పరిష్కరించుకునే నైతిక స్థైర్యం తమకుందని చెప్పారు. పాక్ చర్చల ప్రస్తావనంతా ఒక బూటకమని, మరో ఉగ్రదాడికి ఆదేశం సిద్ధమయ్యేంత వరకూ కాలయాపన జరిపే ఉద్దేశం మాత్రమేనని పాక్ వైఖరిని ఎండగట్టారు.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాక్‌కు గుణపాఠం చెప్పేందుకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని అక్బర్ అన్నారు. పాకిస్థాన్ బూటకపు మాటలను నమ్మే నాయకత్వం తమది కాదని స్పష్టం చేశారు. కాగా, డెన్మార్క్ లో పర్యటిస్తున్న ప్రతినిధి బృందంలో రవిశంకర్ ప్రసాద్, ఎంపీ అక్బర్‌తోపాటు బీజేపీ ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సమిక్ భట్టాచార్య, శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాకం చతుర్వేది, కాంగ్రెస్ ఎంపీలు గులామ్ అలి ఖతానా, అమర్ సింగ్, అంబాసిడర్ పంకజ్ శరణ్ ఉన్నారు.


ఇవి కూడా చదవండి..

జాతీయ వీరత్వానికి చిహ్నంగా సింధూరం.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

పాకిస్థాన్‌పై ఘర్షణల్లో ఫైటర్ జెట్లను కోల్పోయాం.. సీడీఎస్ వెల్లడి

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 31 , 2025 | 05:27 PM