Share News

Pakistan Gets IMF Tranche: తాజాగా పాకిస్థాన్‌కు మరో రూ. 8,500కోట్లు

ABN , Publish Date - May 14 , 2025 | 04:26 PM

పాకిస్థాన్ తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి రెండో విడుత రుణాన్ని కూడా పొందేసింది. తాజాగా $1,023 మిలియన్లు అంటే భారత రూపాయల్లో దాదాపు రూ. 8,500కోట్లు..

Pakistan Gets IMF Tranche: తాజాగా పాకిస్థాన్‌కు మరో రూ. 8,500కోట్లు
Pakistan Gets IMF Tranche

Pakistan received IMF Loan: దాయాది దేశం పాకిస్థాన్ తాజాగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్(ఐఎంఎఫ్) నుంచి రెండో విడుత రుణాన్ని కూడా పొందేసింది. తాజాగా $1,023 మిలియన్లు అంటే భారత రూపాయల్లో దాదాపు రూ. 8,500కోట్లు రుణంగా పొందింది. ఈ విషయాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు తన సోషల్ మీడియా 'ఎక్స్' హ్యాండిల్ ద్వారా తెలిపింది. ఇలా ఉండగా, ఐఎంఎఫ్ ను.. పాకిస్థాన్‌ను మొత్తంగా 20వేల కోట్ల రూపాయల మేర రుణం ఇవ్వాల్సిందిగా కోరింది.రుణంలో భాగంగా ఐఎంఎఫ్ ఒక బిలియన్ డాలర్లు అంటే రూ. 8300 కోట్ల నిధులు ఎక్స్‌టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ కింద మంజూరు చేసింది. మరో 1.4 బిలియన్ డాలర్లు అంటే 11,620 కోట్ల రూపాయలు వాతావరణ మార్పులకు సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేటాయించినట్లు పేర్కొంది. ఈ ఋణం మే 9వ తేదీన ఆమోదం పొందింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ఐఎంఎఫ్ పట్టించుకోకుండా ముందుకెళ్లింది. మే 16తో ముగిసే వారానికి ఈ తాజా చెల్లింపులు.. పాకిస్థాన్ విదేశీ మారక నిల్వలలో చేరాయి. దీని ద్వారా పాక్ విదేశీ నిల్వలు భారీగా పెరిగాయి.

ఒక వైపు,భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న ఈ సమయంలో IMF పాకిస్తాన్‌కు పెద్ద మొత్తంలో రుణ సహాయం చేయడం పై సర్వత్రా నిరసన వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్తాన్ ఉగ్రవాద ప్రేరేపిత కార్యకలాపాలకు నిధులను వినియోగిస్తోందని భారతదేశం పలుమార్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF)కు ఫిర్యాదు చేసినప్పటికీ తాజాగా 2.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 20,000 కోట్లు) రుణ సహాయం అందజేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిధులను పాకిస్తాన్ మళ్లీ ఉగ్రవాద చర్యలకు వినియోగించే అవకాశం ఉందని, ఇప్పటికే భారత్ ఉగ్రవాదం పై పోరాటం సాగిస్తున్న వేళ ఇలాంటి ఆర్థిక సహాయం అందజేస్తే పాకిస్తాన్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని భారత్ హెచ్చరించినా అంతర్జాతీయ రుణ సంస్థ పట్టించుకోలేదు. పైన చెప్పిన కారణాలను ఎత్తిచూపుతూ భారతదేశం IMF బోర్డులో ఓటింగ్‌కు దూరంగా ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్

Operation Sindoor: భుజ్ ఎయిర్‌బేస్‌కు రాజ్‌నాథ్ సింగ్

Droupadi Murmu: రాష్ట్రపతితో సీడీఎస్, త్రివిధ దళాధిపతుల భేటీ

For National News And Telugu News


పాకిస్థాన్‌కు తెలిసొచ్చేదెప్పుడు?

Updated Date - May 14 , 2025 | 04:29 PM