Shashi Tharoor: పాకిస్థాన్ మిత్రులు చైనాలో ఉన్నారు
ABN , Publish Date - Jun 03 , 2025 | 05:29 PM
యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు.

బ్రసిలియా: జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి వెనుక ఉన్న లష్కరే తొయిబా ముసుగు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)ను చైనా కాపాడుతోందని అఖిలపక్ష దౌత్య బృందం సభ్యుడు శశిథరూర్ (Shashi Tharoor) మండిపడ్డారు. పాకిస్థాన్ ప్రభుత్వం చైనా అండతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (UNSC)లోనూ, ప్రెస్నోట్లోను టీఆర్ఎఫ్ పేరును తప్పించిందని అన్నారు. బ్రెజిల్ దౌత్యవేత్త, బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాన సలహాదారులు సెల్సో అమోరిమ్తో జరిపిన సమావేశంలో థరూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
యూఎన్ ఆంక్షల కమిటీకి టీఆర్ఎఫ్కు సంబంధించిన సాక్ష్యాలను పలుమార్లు సమర్పించామని, ప్రతి సందర్భంలోనూ తన మిత్రదేశం పాకిస్థాన్కు అండగా నిలుస్తూ టీఆర్ఎఫ్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకుంటోందని శశిథరూర్ వివరించారు. లష్కరే తొయిబా ఏర్పాటు చేసిన టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే దాడికి తామే బాధ్యులమని ప్రకటించిందని, అయితే ఇందువల్ల తలెత్తే పరిణామాల గుర్తించి పాక్లోని సోషల్ మీడియా హ్యాండిలర్స్ దానిని డిలీట్ చేశారని చెప్పారు. యూఎన్ఎస్సీ ప్రెస్మీట్లోనూ టీఆర్ఎఫ్ ప్రస్తావన చేర్చాలని ఇండియా పదేపదే కోరినప్పటికీ పాకిస్థాన్ ప్రభుత్వం చైనాలోని తమ మిత్రుల అండతో ఆ పేరును తప్పించిందని, కనీసం దాని ప్రస్తావన కూడా లేదని వివరించారు. ఈ పద్ధతి మారాలంటే భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్ ఉండాలన్నారు.
ఇవీ చదవండి:
భారత్లో అధికార భాషపై కనిమొళి స్పెయిన్లో ఏమన్నారంటే..
పాకిస్తాన్కు షాక్.. జైలు నుంచి 200 మంది ఖైదీల పరార్..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి