Share News

WHO: పాక్ పన్నాగం పటాపంచలు.. WHOలో అనుపమ స్పీచ్.. వైరల్

ABN , Publish Date - May 22 , 2025 | 12:09 PM

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సాక్షిగా పాక్ వెన్ను విరిచింది భారత దౌత్యవేత అనుపమ సింగ్ చేసిన ప్రసంగం. ఆ స్పీచ్ ఇప్పుడు యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.

WHO: పాక్ పన్నాగం పటాపంచలు.. WHOలో అనుపమ స్పీచ్.. వైరల్
Anupama Sing

WHO(వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్)లో పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో పాకిస్థాన్ పాత్రను పేర్కొంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థలో తన వాణిని వినిపించింది భారత్. జెనీవాలోని WHO ప్రధాన కార్యాలయంలో భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ ప్రపంచం ముందు పాక్ బండారాన్ని కుండ బద్ధలు కొట్టారు. భారతదేశపు ప్రత్యుత్తర హక్కును వినియోగించుకుంటూ చేసిన ఆమె ప్రసంగం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. పాకిస్తాన్‌ను విమర్శిస్తూ ఆమె, "పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది.. అయితే, దాని బాధితురాలిగా మాత్రం భారత్ మారదు" అని తేల్చి చెప్పారు.

"పాకిస్తాన్ నేల నుండి తలపెడుతున్న ఉగ్రవాదాన్ని.. స్పాన్సర్లు, దాని నిర్వాహకులు మర్చిపోకూడదు. ప్రతిస్పందనగా, భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. కచ్చితంగా పాక్ లోపల ఉన్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దృష్టి సారించింది." అన్నారు. భారతదేశ సంయమనాన్ని నొక్కి చెబుతూ ఆమె.. "పాక్ పౌరులను లక్ష్యంగా చేసుకోకుండా లేదా హాని చేయకుండా ఉండేలా మేము చర్యలు తీసుకున్నాం. బదులుగా, పాకిస్తాన్లో శిక్షణ పొందిన ఉగ్రవాదులు, వారి కీలక రహస్య స్థావరాలను తుదముట్టించాం." అన్నారు. అంతేకాదు, "సింధు జలాల ఒప్పందం గురించి పాకిస్తాన్ తప్పుడు కథనాల్ని ప్రచారం చేస్తోందన్న ఆమె, ఈ సమస్యను జటిలం చేయడానికి పాక్ ప్రయత్నిస్తోంది." అని చెప్పారు.


అనుపమ సింగ్ ఎవరు?

అనుపమ సింగ్ తొమ్మిదేళ్లకు పైగా భారత విదేశాంగ శాఖలో దౌత్యవేత్తగా పనిచేస్తున్నారు. IFSలో చేరడానికి ముందు, ఆమె 2012-2014 మధ్య KPMGలో పనిచేశారు. కన్సల్టెంట్‌గా కెరీర్ ప్రారంభించి, తరువాత సీనియర్ కన్సల్టెంట్ స్థాయికి చేరుకున్నారు. అనుపమ 2014లో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్‌లో పరిపాలనలో శిక్షణ పూర్తి చేశారు. సింగ్ 2008 నుండి 2011 వరకు కార్పొరేట్ ఫైనాన్స్, వాల్యుయేషన్, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌లో స్పెషలైజేషన్‌తో CFA ప్రోగ్రామ్‌ను కూడా అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలోని మేనేజ్‌మెంట్ స్టడీస్ ఫ్యాకల్టీ నుండి ఫైనాన్స్‌లో MBA గ్రాడ్యుయేషన్ చేశారు. మౌలానా ఆజాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో B.Tech పట్టా పొందారు.

Updated Date - May 22 , 2025 | 12:14 PM